సీయం రేవంత్ రెడ్డి అవినీతిపై బుక్ లెట్ ప్రచురిస్తాం
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అవినీతి చక్రవర్తి అనే బిరుదు ఇస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. గురువారం హైదరాబాద్ లో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అవినీతిపై జాగృతి ఆధ్వర్యంలో బుక్ లెట్ ప్రచురించి రాష్ట్ర వ్యాప్తంగా పంచుతామని ప్రకటించారు. 18 నెలల పరిపాలనలో రెండు లక్షల కోట్లు అప్పులు చేసిన రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలియజేశారు. అంత అప్పు చేసినా పించన్లు ఇవ్వడం లేదు, మహలక్ష్మీ పథకం అమలు చెయ్యడం లేదని విమర్శించారు. 2లక్షల కోట్ల రూపాయల అప్పులపై సీఎం రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని కవిత డిమాండ్ చేశారు.
కేసీఆర్ ఆర్ఈసి వద్ద అప్పులు తెచ్చి ప్రాజెక్టులు కట్టారని కవిత అన్నారు. తెచ్చిన అప్పులను కేసీఆర్ తిరిగి కట్టారని అందుకే ఆర్ఈసి సంస్థ కేసీఆర్ ప్రభుత్వానికి ఏ గ్రేడ్ ఇచ్చిందని కవిత గుర్తు చేశారు. అదే ఈఆర్సీ సంస్ధ అప్పులు చెల్లించడం లేదని2024లో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారని తాజాగా జూన్ 28లోపు కట్టాల్సిన 1320 కోట్లు చెల్లించాలని ఈఆర్సీ సంస్ధ రాష్ట్ర ప్రభుత్వానికి మరో లేఖ రాసిందని కవిత చెప్పారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభం కాకముందే కాంట్రాక్ట్ కంపెనీలకు ఆడ్వాన్సులు ఇచ్చారని కవిత ఆగ్రహం వ్యక్తి చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రగతి అజెండాలో పోలవరం ప్రాజెక్టు చర్చను ఎత్తివేశారని నిరసన వ్యక్తం చేశారు. భద్రాచలం రాముడు మునుగుతున్నా తెలంగాణలో ఉన్న 8మంది బీజేపీ ఎంపీలు నోరెత్తడంలేదని అన్నారు. జూలై 6వ తేదీకి తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరిగి సంవత్సరం అవుతుందని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీ తర్వాతే బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆంధ్రాలో మేధావులు మీటింగ్ పెట్టారని తెలిపారు. చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు భయపడి రేవంత్ రెడ్డి బనకచర్లపై సైలెంట్ అయ్యారని కవిత విమర్శించారు
