ప్రపంచ ప్రసిద్ధ తెలుగు తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి తనకు రోల్‌ మోడల్‌ అని మిస్‌ బెల్జియం కారెన్‌ తెలిపారు. మిస్‌ యూనివర్స్‌ 2025లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన కారెన్‌.. పొలిటెంట్‌ మీడియాకు స్పెషల్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలను గురించి వెల్లడించారు. హ్యూమనిటీకి సంబంధించి కృష్ణమూర్తి చెప్పిన అంశాలు తనకు ఎంతో ప్రేరణ ఇచ్చాయన్నారు.



తాను సైకాలజీ అభ్యసిస్తున్నానని, అందుకే, ఇతరులకు మానసికంగా సహాయం చేయడమే తన జీవిత లక్ష్యమని తెలిపారు. "ప్రతి ఒక్కరూ తమ స్వీయ శక్తిని విశ్వసించాలి. అస్థిరత క్షీణత కాదు, అది ఒక బలంగా మలచుకోవచ్చు. నిజమైన మనల్ని మనం అంగీకరించినపుడే నిజమైన ఆనందాన్ని పొందగలుగుతాం," అని భావోద్వేగంగా వివరించారు.



తనకు డ్యాన్స్‌ ఇష్టమని, భారత్‌లో జరిగిన ఓపెనింగ్ సెర్మనీలో భారతీయ శైలిలో డ్యాన్స్‌ చేయడం ఎంతో ఆనందంగా అనిపించిందన్నారు. ఇది తన తొలి భారత ప్ర‌యాణం అని, ఎంతోకాలంగా ఇండియా వెళ్లాలని అనుకున్న నా కల ఇప్పుడు నెలవేరిందని పేర్కొన్నారు. తాను లాడ్‌ బజార్‌లో కొన్న ఎర్రగాజులు తన దుస్తులకు ఎంతో చక్కగా సరిపోతున్నాయని, ఎరుపు ధైర్యానికి, కలల కోసం పోరాడే శక్తికి ప్రతీక. అందుకే ఈ రంగు అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు కారెన్‌. చార్మినార్ సహా పలు ప్రాంతాలు సందర్శించిన కారెన్‌.. ఇక్కడి శిల్పకళ, చేతితో చేసిన పనులు చూస్తే నిజంగా అబ్బురపడ్డానన్నారు. ప్రతీ కట్టడం ఒక కళాఖండంలా ఉందని అభివర్ణించారు. అయితే, హిందీ సినిమాల గురించి పెద్దగా తెలియదన్న కారెన్‌.. అవకాశమొస్తే బాలీవుడ్‌లో నటించేందుకు సిద్ధమన్నారు.


Updated On 29 May 2025 3:47 PM IST
Politent News Web4

Politent News Web4

Next Story