రోజూ పన్నీర్ కర్రీనే తింటున్నా - మిస్ నమీబియా
హైదరాబాద్ పన్నీర్ కర్రీ అద్భుతంగా ఉందని, ఇష్టమైన ఫుడ్గా మారిందని, తాను వెజిటేరియన్ కావడంతో రోజూ అదే తింటున్నానని మిస్ నమీబియా సల్మా కమయా చెప్పారు. మిస్ వరల్డ్ పోటీల కోసం హైదరాబాద్ వచ్చిన కమయా.. పొలిటెంట్ న్యూస్కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఆఫ్రికా ఖండంలోని అందమైన దేశం నమీబియా నుంచి సల్మా కమయా మిస్ వరల్డ్లో పోటీ పడుతోంది. హైదరాబాద్ సంస్కృతి, ఎంతో వైవిధ్యంగా ఉందని, తెలంగాణ ప్రజల ఆతిథ్యానికి, ఇక్కడి వంటకాలకు పూర్తి ఫిదా అయిపోయానన్నారు. హైదరాబాద్ జీవన శైలి, ఆత్మీయత తమ ఆఫ్రికాలోని మదర్ కంట్రీని గుర్తు చేస్తోందని, హైదరాబాద్ తనకు మరో ఇల్లులా ఉందని చెప్పారు.
బాలీవుడ్ హీరోయిన్స్ ఐశ్వర్యా రాయ్, ప్రియాంకా చోప్రా తనకు ఇష్టమైన నటీమణులని, ప్రియాంకా మిస్ వరల్డ్ గెలిచిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ, తనకు కూడా అలాంటి ప్రేరణ అవసరమని అన్నారు.
తనకో సొంత స్వచ్ఛంద సంస్థ ఉందని ఆసంస్థ ద్వారా మానసిక ఆరోగ్యంపై అవగాహన, మహిళల ఆర్థిక పరిపుష్టి, యువత శక్తికల్పన కోసం కళల ద్వారా ఉద్యమాలు, సాంకేతిక అభివృద్ధి, వ్యవసాయంపై ప్రాజెక్టులు వంటివన్నీ చేస్తున్నట్లు కమయా వివరించారు.
