పాకిస్థాన్, అప్ఘాన్ బోర్డర్లు మూసేస్తున్న ఇరాన్ !!

- ఉగ్ర దేశాల సరిహద్దులు మూసేయాలని ఇరాన్ నిర్ణయం
- పాకిస్థాన్, అప్ఘాన్ సరిహద్దుల్లో గోడ నిర్మాణం
- డ్రగ్ ట్రాఫికింగ్,స్మగ్లింగ్,అక్రమ వలసలతో ఉక్కిరి బిక్కిరి
- ఉగ్రవాద దాడులతో నిరంతర జన హననం
- ఉమ్మడి సరిహద్దువల్ల 80% డ్రగ్ ట్రాఫికింగ్
- విదేశీ శరణార్ధులతో మరో బెడద
- శక్తికి మించి వస్తున్నారని ఆందోళన
- పశ్చిమ దేశాల ఆంక్షలతో పెరుగుతున్న వలసలు
- అన్నింటికీ సరిహద్దు గోడతో చెక్ పెట్టాలని నిర్ణయం
భద్రతాపరపరమైన కారణాల రీత్యా పొరుగుదేశాలైన పాకిస్థాన్,ఆఫ్ఘనిస్తాన్ లతో సరిహద్దులు మూసేయాలని ఇరాన్ నిర్ణయించుకుంది.ఈ రెండు దేశాలనుంచి అక్రమంగా రవాణా అవుతున్న డ్రగ్స్, ఇంధనం, ఇతర వస్తువుల స్మగ్లింగ్, అక్రమ వలసలను నిరోధించే ఉద్దేశంతో సరిహద్దుల్లో గోడ నిర్మించుకుంటోంది.
ఇరాన్ భద్రతా దళాల సమాచారం ప్రకారం పాకిస్థాన్, ఆప్ఘనిస్తాన్ లతో ఇరాన్ కు ఉన్న ఉమ్మడి సరిహద్దువల్ల దేశంలోకి 80 శాతం డ్రగ్ ట్రాఫికింగ్ జరుగుతోందని చెబుతున్నాయి.ఈ గోడ పొడవు 300 కిలోమీటర్లు కాగా, దాని ఎత్తు నాలుగు మీటర్లు. సిస్టాన్, బెలుచిస్తాన్ ప్రావిన్సులలోని దక్షిణభాగంలో గోడ నిర్మాణం ఇప్పటికే మొదలైంది.సరిహద్దుల నిర్మాణం తొలిదశ 90 కిలోమీటర్ల దూరం వరకూ నిర్మిస్తారు. అది ఈ ఏడాది జూన్ నెల చివరి వారం నుంచి మొదలవుతుంది. ఇందులో ముళ్ల కంచె నిర్మాణం, శతృదేశాల రాడార్ వ్యవస్థలను పసిగట్టే రాడార్ టెక్నాలజీ కూడా ఏర్పాటు చేస్తారు.ఇటీవల కాలంలో అక్రమ డ్రగ్స్ రవాణా ఇరాన్ లో ఎక్కువైపోయింది. దాంతో సరిహద్దులను మూసివేయాలని నిర్ణయించారు. అందువల్ల ఇటు పాకిస్థాన్,అటు అప్ఘానిస్తాన్ సరిహద్దులను మూసివేయాలని ఇరాన్ నిర్ణయించింది.ఈ మధ్య కాలంలో ఇరాన్ లో ఎంతో మంది అమాయక పౌరులు, సెక్యూరిటీ బలగాలు ఉగ్రదాడులకు బలైపోయాయి. జైషే ఆల్ అదుల్ అనే ఉగ్ర సంస్థ ఈదాడులకు తెగబడటం ఇరాన్ ను కలవర పరుస్తోంది.మరోవైపు అటు అప్ఘానిస్థాన్ నుంచి కూడా ఇరాన్ ఇటువంటి తరహా ఇబ్బందులే ఎదుర్కొంటోంది. షిరాజ్ లో 2022లో,2023లో 2024లో కెర్మాన్లో ఇదే తరహా దాడులు జరిగి వంద మంది చనిపోయారు.అలాగే సరిహద్దుల నుంచి దేశంలోకి చొరబడే అక్రమ వలసదారులతో కూడా సమస్య పెరుగుతోంది.ఏళ్లతరబడి యుద్దంతో చితికి పోతున్న ఇరాన్లోకి వలస వచ్చిన అమెరికా, ఆప్ఘనిస్థాన్ పౌరులు పేదరికంతోనూ, అభద్రతతోనూ అక్కడ ఉండలేక అక్కడ నుంచి వేర్వేరు ప్రాంతాలకు వలస వెళుతున్నారు.
ఈ పరిణామాలపై ఇరాన్ హోం శాఖా మంత్రి ఒక ప్రకటన చేస్తూ అప్ఘానిస్థాన్ పౌరులతో ఇరాన్ కు ఏళ్ల తరబడి సత్సంబంధాలే ఉన్నా ఇరాన్ లో ఉన్న పరిమిత వనరుల రీత్యా ఎక్కువమంది విదేశీయులను భరించే ఆర్థిక శక్తి లేదని తెలిపారు.ఒక నియమబద్ధమైన ప్రణాళికతో విదేశీయులను బయటకు పంపడమే తమ ముందున్న ప్రస్తుత కర్తవ్యమని ఆయన అన్నారు. ఇమ్మిగ్రంట్ల మనోభావాలు దెబ్బతినకుండా సమతూకం పాటిస్తూ ఒక విధానాన్ని రూపొందిస్తామని అన్నారు.పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా తలెత్తిన ఆర్థిక పరమైన సవాళ్లను తట్టుకోడానికి ఇరాన్ తన ప్రయత్నాలు తాను చేస్తోంది.పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల ఇరాన్ లోకి వేలాదిగా శరణార్ధులు చొచ్చుకువస్తున్నారు. వారిని భరించే శక్తి తనకు లేదని ఇరాన్ చెబుతోంది.
