ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి అంతరిక్షం లోకి వెళ్లే అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. 23 ఏళ్ల జాహ్నవి 2029లో స్పేస్లోకి వెళ్లేందుకు అర్హత సాధించారు. యునైటెడ్ స్టేట్స్ కు చెందిన టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ (TSI) చేపట్టే టైటాన్ స్పేస్ మిషన్ కోసం ఓ వ్యోమగామిగా ఆమె ఎంపికయ్యారు. ఈ యాత్రలో భాగంగా జాహ్నవి అంతరిక్షంలో 5 గంటలపాటు ఉండనున్నారు. ఇందుకోసం ఆమెకు పలు దేశాల్లో ట్రైనింగ్ ఇస్తారు.

Updated On
Next Story