థాయ్ లాండ్ పర్యటనకు వెళ్లిన భారతీయ టూరిస్టుకి చేది అనుభవం ఎదురైంది. పర్యాటకానికి ప్రసిద్ది చెందిన పుకెట్ దీవుల్లో టైగర్ కింగ్ డమ్ సఫారీకి వెళ్లాడు. ఆ యువకుడు పులితో సరదాగా గడుపుతూ సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. సెల్ఫీ కోసం పులి పక్కన కూర్చోగానే అకస్మా్త్తుగా గాండ్రించింది. పులి సంరక్షకుడి ఎదుటే పర్యాటకుడిపై దాడి చేసింది. పులి దాడిలో ఆయనకు గాయాలయ్యాయి. టూరిస్టుకు షాక్ ఇచ్చిన పులి వ్యవహారం వీడియో ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతోంది.

Updated On
Next Story