US makes sensational decision on visa protection measures for Nepalese citizens

ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ వంటి ముస్లిం దేశాల పౌరులపై నిషేధం విధించిన తర్వాత, నేపాల్ విషయంలో కూడా అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేపాల్కు ఇచ్చిన బహిష్కరణ రక్షణను రద్దు చేశారు. ఈ నిర్ణయం తర్వాత, ఇప్పుడు 7,500 మంది నేపాలీలు వెంటనే అమెరికాను విడిచి వెళ్ళవలసి ఉంటుంది.

న్యూస్వీక్ కథనం ప్రకారం, నేపాల్లో పరిస్థితి ఇప్పుడు 2015లో ఉన్నట్లు లేదని, కాబట్టి దాని బహిష్కరణ రక్షణను రద్దు చేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం చెబుతోంది. నేపాల్లో భూకంపం కారణంగా అప్పటి అమెరికా ప్రభుత్వం నేపాలీ పౌరులకు రక్షణను అందించింది. అమెరికాలో దీనిని తాత్కాలిక రక్షిత స్థితి లేదా టిపిఎస్ అంటారు. తమ దేశంలో పరిస్థితుల దృష్ట్యా అమెరికా వెళ్లి నివసించాలనుకునే వారికి అమెరికా ప్రభుత్వం రక్షణ హామీ ఇస్తుంది. బహిష్కరణ రక్షణ కింద, ఇతర దేశాల ప్రజలకు పని చేసే హక్కు మాత్రమే ఉంటుంది. వారికి పౌరసత్వం లభించదు. ట్రంప్ అధికారంలోకి రాగానే ఏ దేశానికీ రక్షణ ఇవ్వమని తెగేసి చెప్పారు.

టిపిఎస్ కింద 7500 మంది నేపాల్ పౌరులు అమెరికాలో నివసిస్తున్నారు. దీనిని రద్దు చేసిన తర్వాత, వారు వెంటనే తమ దేశానికి తిరిగి రావల్సి ఉంటుంది. లేదంటే అమెరికా ప్రభుత్వం వారిని బలవంతంగా నేపాల్కు పంపవచ్చు. 2017లో అధ్యక్షుడైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ దానిని అంతం చేయాలని కోరుకున్నారు. కానీ ఇమ్మిగ్రేషన్ విభాగం వ్యతిరేకించింది. ట్రంప్ చివరి వరకు దీనికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. కానీ విజయం సాధించలేకపోయారు.

నేపాల్లో పరిస్థితి మునుపటి మాదిరిగా లేదని… దీంతో బహిష్కరణ రక్షణకు అర్థం లేదని ట్రంప్ పరిపాలన యంత్రాంగం చెబుతోంది. రెండు రోజుల క్రితమే అమెరికా అధ్యక్షుడు 12 దేశాల ప్రజలను నిషేధించాలని నిర్ణయించారు. ఈ దేశాలలో ఉగ్రవాదం విజృంభిస్తోందని ట్రంప్ సర్కార్ చెబుతోంది. ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్ వంటి దేశాలు ట్రంప్

నిర్ణయంపై స్పందించకపోగా, చాద్ దేశం దీనికి వ్యతిరేకంగా పెద్ద నిర్ణయం తీసుకుంది. చాద్ తన దేశంలోకి అమెరికన్ పౌరుల ప్రవేశాన్ని నిషేధించాలని నిర్ణయించింది. మన ఆత్మగౌరవాన్ని అమ్ముకుని అమెరికాతో మాట్లాడలేమని చాద్ దేశాధ్యక్షుడు అంటున్నారు.

Politent News Web3

Politent News Web3

Next Story