"యుద్ధం మొదలైంది" - ట్రంప్ వార్నింగ్ తర్వాత ఖమేనీ సంచలన ట్వీట్
"War has begun" - Khamenei's sensational tweet after Trump's warning

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన గట్టి హెచ్చరికకు ప్రతిగా ఖమేనీ చేసిన "యుద్ధం మొదలైంది" అనే ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.
ట్రంప్ తన ట్వీట్లో, "ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో మాకు తెలుసు. తాము చంపాలని భావించట్లేదు కానీ బేషరతుగా లొంగకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి" అని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల తర్వాత ఖమేనీ ‘ఎక్స్’లో చేసిన పోస్ట్ పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చేసింది. "నమి పేరుతో యుద్ధం మొదలైంది. అలీ తన జుల్ఫికర్తో ఖైబర్కు వచ్చారు." అంటూ ఎక్స్లో ట్వీట్ చేసిన ఖమేనీ.. ఈపోస్ట్కు ఖడ్గం పట్టిన వ్యక్తి కోట గేటు వద్ద నిలుచున్న ఫోటో కూడా యాడ్ చేశారు, ఆ కోటపై నిప్పుల వర్షం కురుస్తున్నట్టుగా ఉంది. ఇది శియా చరిత్రలో 7వ శతాబ్దంలో ఖైబర్పై జరిగిన యుద్ధాన్ని సూచిస్తుందని `టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్` అంచనా వేసింది.
అంతే కాక, కొన్ని గంటల తర్వాత ఖమేనీ మరో పోస్ట్ చేశారు. "మేము బలంగా ప్రతిస్పందిస్తాం. ఎవరిపైనా కనికరం చూపే ప్రసక్తి లేదు." అంటూ కంటిన్యూ చేశారు.
మరోవైపు.. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య క్షిపణుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం తెల్లవారుజామున టెహ్రాన్లో పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అలాగే టెల్ అవీవ్లోనూ పేలుళ్లు సంభవించాయి. జెరూసలెంలో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాన్ని జూన్ 21 వరకూ తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
