5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పుస్తకం ఆవిష్కరణ

Update: 2025-06-16 04:03 GMT

కూటమి ప్రభుత్వానిది సుపరిపాలన కాదని సూపర్‌ సిక్స్‌ కు ఎగనామం పెట్టిన పాలన అని మాజీ మంత్రి ఆర్‌కేరోజా వ్యాఖ్యానించారు. తిరుపతి మాజీ శాసనసభ్యలు భూమన కరుణాకరరెడ్డితో కలసి 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు అనే పుస్తకాన్ని మాజీ మంత్రి రోజా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ సూపర్‌ సిక్స్‌ కు ఎగనామం పెట్టడాన్ని సుపరిపాలన అంటారా అని రోజా ప్రశ్నించారు. లక్షా ఎనభై వేల కోట్లు ఎగనామం పెట్టడం సుపరిపాలనా అని నిలదీశారు. సీబీఎన్‌ అంటే చీటింగ్‌... బాదుడే బాదుడు... నేరాలు అని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం కంటే సంక్షేమం ఎక్కువగా అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు మోసం చేశారన్నారు. ఎల్లో బుక్‌ మ్యానిఫెస్టో పక్కన పెట్టి రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తున్నారని విమర్శించారు. సూపర్‌ సిక్స్‌ అమలు చేశాసామని సీయం చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్దం చెపుతున్నారని మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మ ఒడి సృష్టికర్త వైఎస్‌.జగన్మోహనరెడ్డే అని రోజా అన్నారు. ఆ రోజు అమ్మ ఒడి... నాన్నకు బుడ్డి అని ఎగతాళి చేసిన మీరే ఇప్పుడు అదే పథకాన్ని అమలు చేస్తున్నారని రోజు గుర్తు చేశారు. ఒక్క బాత్‌ రూమ్‌ కూడా కట్టించకుండా ఒక్కో విద్యార్థి నుంచి రెండు వేలు నొక్కేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి పదో తరగతి పరీక్ష పేపర్లు కూడా దిద్దడం చేతకాలేదన్నారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు స్పందించడం లేదని రోజా ప్రశ్నించారు. ఎమ్మెల్యే అయిపోయాను... డిప్యూటీ సీయం అయిపోయాను అని పవన్‌ కళ్యాణ్‌ ఓ మూలన కూర్చున్నాడని అన్నారు. కూటమి ప్రభుత్వం హనీమూన్‌ టైమ్‌ అయిపోయిందని కౌంట్‌ డౌన్‌ స్టార్ట్ అయ్యిందని ఇక రెడ్‌ బుక్‌ రాజ్యాంగం పక్కనపెట్టాలని మాజీ మంత్రి రోజా హితవు పలికారు. ఈ బుక్‌ రిలీజ్‌ కార్యక్రమంలో రోజాతో పాటు భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీలు భరత్‌, సిపాయి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News