యోగా డే నిర్వహణపై విశాఖలో సమీక్ష చేసిన సీయం చంద్రబాబు

సమీక్షలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు;

Update: 2025-06-16 12:29 GMT

విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిధిగా హాజరవుతున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. యోగ డే ఏర్పాట్లపై సీయం చంద్రబాబు విశాఖపట్నంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీయం మాట్లాడుతూ 607 అర్బన్ సెక్రటేరీయట్లతో అనుసంధానం చేసుకోవడమే కాకుండా.. మిగిలిన సెక్రటేరీయేట్లల్లోని సిబ్బందిని కూడా యోగా డే నిర్వహణలో వినియోగించుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. అలాగే ఏఏ కంపార్టుమెంట్లలో ఎవరెవరు ఆసనాలు వేస్తారనే అంశంపై కూడా గందరగోళం లేకుండా సమన్వయం చేసుకోవాలని అధికారులకు సీయం ఆదేశించారు. పార్కింగ్‌, టాయిలెట్లు వంటి మౌలిక సదుపాయల ఏర్పాట్లలో ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. వాతావరణ సూచనల ప్రకారం వర్షం పడే అవకాశాలు లేకున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకోవాలని సీయం అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా యోగా డే కార్యక్రమ నిర్వహణఫై మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల వద్ద సీయం చంద్రబాబు అభిప్రాయాలు సేకరించారు. అయితే ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొననుండటంతో ఏపీ ప్రభుత్వం యోగ డే నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రపంచ రికార్డు లక్ష్యంగా యోగా డే నిర్వహించడానికి ప్రభుత్వం గత రెండు నెలలుగా కసరత్తు చేస్తోంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన రామకృష్ణా బీచ్‌ లో యోగా డే నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఒక్క ఆర్కే బీచ్‌ లోనే దాదాపు ఐదు లక్షల మంది యోగాసనాలు వేయడానికి 326 కంపార్టమెంట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది వరకు యోగా డేలో పాలుపంచుకుంటారని చేస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Tags:    

Similar News