రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధికి సహకరించండి

కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ని కోరిన నారా లోకేష్;

Update: 2025-06-19 09:19 GMT

ఆంధ్రప్రదేశ్‌ లోని రాయలసీమ ప్రాంతంలో ఫుడ్‌ ప్రోసెసింగ్‌ యూనిట్ల అభివృద్ధికి సహకరించాలని కేంద్ర ఫుడ్‌ ప్రోసెసింగ్‌ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌కు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో ఉన్న నారాలోకేష్‌ కేంద్ర మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌ తో భేటీ అయ్యారు. పండ్ల తోటల అభివృద్ధికి అన్ని విధాల అనుకూలమైన వాతావరణం కలిగిన రాయలసీమను హార్టీకల్చర్‌ హబ్‌ గా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని ఈ సందర్భంగా చిరాగ్‌ పాశ్వాన్‌ని కోరారు. రాయలసీమలో రైతులు మామిడి, అరటి, టమోటా, బత్తాయి, దానిమ్మ, డేట్స్ వంటి పండ్ల తోటలను పెద్దఎత్తున సాగు చేస్తున్నారని అయితే పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధర లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రికి వివరించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా వారి కష్టాలను ప్రత్యక్షంగా చూశానని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా అక్కడి రైతులకు మెరుగైన రేట్లు లభించి ఆదాయం పెరిగే అవకాశం ఉందని నారా లోకేష్‌ కేంద్రమంత్రికి చెప్పారు . రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు సహకరించాలకు లోకేష్ కోరారు. దీనికి కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ స్పందిస్తూ... ఎపిలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధికి పూర్తిస్థాయి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తిరుపతి ట్రిపుల్ ఐటిలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభోత్సవానికి నేను ఏపీకి వస్తున్నాను. జులై 11, 12 తేదీల్లో రాయలసీమ పర్యటనకు వస్తున్నాని మీరు కూడా వస్తే క్షేత్ర స్థాయిలో పర్యటించి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలపై అధ్యయనం చేద్దామని కేంద్రమంత్రి లోకేష్‌ కు సూచించారు.

Tags:    

Similar News