వేగంగా కొనసాగుతున్న నకిలీ నెయ్యి కేసు
తిరుమల శ్రీవారి లడ్డులో వినియోగించే నెయ్యి లో కల్తీ జరిగిందినే కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కి పిఏ గా పని చేసిన అప్పన్నకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. బుధవారం నుంచి మూడు రోజులు పాటు తిరుపతి లోని సిట్ కార్యాలయంలో అప్పన్నను సీట్ అధికారులు ప్రశ్నించనున్నారు. నత్వరలో మాజీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి, మాజీ ఈవో ధర్మారెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. టీటీడీ మాజీ జేఈవో కి సహ ఇతర అధికారులకు నోటీసులు ఇచ్చి విచారించనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 2024 సెప్టెంబర్లో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జంతు కొవ్వు , చేప నూనెతో కూడిన కల్తీ నెయ్యి ఉపయోగించినట్లు ఆరోపించారు. దర్యాప్తు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. అయితే, సిట్ దర్యాప్తుపై పారదర్శకత లేని ఆరోపణలు రావడంతో, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఆధ్వర్యంలో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేశారు. ఈ బృందంలో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరు సభ్యులుగా ఉన్నారు.ఈ కేసులో ఇప్పటివరకు 15 మందిని నిందితులుగా పేర్కొనగా, వీరిలో 6 మందిని సిట్ అరెస్టు చేసింది. తమిళనాడులోని ఏఆర్ డెయిరీ, ఉత్తరాఖండ్లోని బోలేబాబా డెయిరీ, యు తిరుపతిలోని వైష్ణవి డెయిరీకి చెందిన వ్యక్తులు అరెస్టు అయ్యారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో తెర వెనుక ఎవరు ఉన్నారన్న దానిపై సిట్ విచాణ జరుపుతోంది. కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించి టెండర్ నిబంధనలను మార్చిన సూత్రధారులపై సిట్ దృష్టి సారించింది. ఏఆర్ డెయిరీకి టెండర్ దక్కేలా వైఎస్ఆర్సిపి హయాంలో టీటీడీ పాలకవర్గంలోని కొంతమంది సభ్యులు, అధికారులు పనిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.లభించిన ఆధారాలతో TTD మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నకు సిట్ నోటీసులు జారీ చేసి, ప్రశ్నిస్తున్నారు. అప్పన్నతో పాటు మరో ఆరుగురు టీటీడీ ఉద్యోగులను కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రాథమికంగా లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారని గుర్తించారు. ఈ క్రమంలో అక్రమాలు ఎవరు చేశారు.... అవినీతి ఎలా జరిగింది.. కల్తీ నెయ్యిలో ఏమేమి కల్తీ అయ్యాయన్నది వెల్లడి కావాల్సి ఉంది. ఇవన్నీ వెల్లడి అయితే .. దర్యాప్తు నివేదికను సీబీఐ సుప్రీంకోర్టుకు సమర్పించే అవకాశం ఉంది.