Minister Nara Lokesh: శిర్డీలో సాయినాథుని దర్శించుకున్న మంత్రి నారా లోకేశ్ దంపతులు

మంత్రి నారా లోకేశ్ దంపతులు

Update: 2026-01-12 10:55 GMT

Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణితో కలిసి మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శిర్డీలో సాయిబాబాను దర్శించుకున్నారు.

సోమవారం ఉదయం శిర్డీ చేరుకున్న లోకేశ్ దంపతులు సాయినాథుని దివ్య దర్శనం చేసుకున్నారు. ఆలయంలో నిర్వహించే ప్రత్యేక కాకడ హారతి, ఇతర పూజా కార్యక్రమాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

శ్రీ సాయి బాబా సంస్థాన్ ట్రస్ట్ సభ్యులు, ఆలయ అధికారులు లోకేశ్ దంపతులకు హృదయపూర్వక స్వాగతం పలికి, దుప్పట్లు (దుశ్శాలువలు)తో సత్కరించారు. హారతి ముగిసిన తర్వాత స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు.

ఈ దర్శనం సందర్భంగా మంత్రి లోకేశ్ వెంట ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు ఉన్నారు. ఈ పుణ్య యాత్ర ద్వారా లోకేశ్ దంపతులు సుఖశాంతులు, రాష్ట్ర ప్రగతి కోసం ప్రార్థనలు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News