‘Montha’ Turns into Severe Cyclone: మొంథా’ తీవ్ర తుపానుగా మారి.. మంగళవారం కాకినాడ సమీపంలో తీరం దాటనుంది!
మంగళవారం కాకినాడ సమీపంలో తీరం దాటనుంది!
‘Montha’ Turns into Severe Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుపాను తీవ్ర తుపానుగా (సీవియర్ సైక్లోనిక్ స్టార్మ్) బలపడింది. విశాఖలోని వాతావరణ కేంద్రం (IMD) ఈ విషయాన్ని ధృవీకరించింది. గత ఆరు గంటలుగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయవ్య దిశలో కదులుతోందని తెలిపింది.
ప్రస్తుతం మచిలీపట్నం నుంచి 190 కి.మీ., కాకినాడ నుంచి 270 కి.మీ., విశాఖపట్నం నుంచి 340 కి.మీ. దూరంలో తుపాను కేంద్రం ఉంది. క్రమంగా ఉత్తర-వాయవ్య దిశగా ముందుకు సాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
మంగళవారం సాయంత్రం లేదా రాత్రి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటనుంది. ఆ సమయంలో గంటకు గరిష్ఠంగా 110 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని అంచనా.
తుపాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలవంతమైన గాలులు వీస్తాయి. నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.