Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతపై మంత్రి లోకేశ్‌ ఆగ్రహం

మధ్యాహ్న భోజనం నాణ్యతపై మంత్రి లోకేశ్‌ ఆగ్రహం

Update: 2026-03-13 11:55 GMT

Nara Lokesh: ఎన్టీఆర్ జిల్లాలోని దేవుని చెరువు పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత లేకపోవడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటన వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులకు కలిగిన ఇబ్బందులకు ఆయన క్షమాపణలు చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఉత్తమమైన సంరక్షణ, నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ఆహార నాణ్యత తక్కువగా ఉందనే సమాచారం అందగానే వెంటనే చర్యలు చేపట్టామని తెలిపారు.

ఈ విషయంపై విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ నివేదిక ఆధారంగా ఆహార సరఫరా ఏజెన్సీని మార్చడంతో పాటు ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేశామని లోకేశ్ వెల్లడించారు.

ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో మళ్లీ తలెత్తకుండా పర్యవేక్షణను మరింత బలోపేతం చేస్తున్నామని ఆయన అన్నారు. LEAP యాప్ ద్వారా తల్లిదండ్రుల నుంచి నేరుగా ఫీడ్‌బ్యాక్ సేకరించే విధంగా వ్యవస్థను బలపరుస్తున్నామని, దీని ద్వారా సమస్యలను త్వరగా గుర్తించి తక్షణమే చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, ఏ చిన్న లోపమైనా సహించబోమని లోకేశ్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News