సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస రావుకు మంగళగిరి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. సాక్షి టీవీ ఛానెల్లో జరిగిన ఓ డిబేట్లో ఒక గెస్టు.. అమరావతి మహిళల పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఆ డిబేట్ను హోస్ట్ చేసిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను సోమవారం హైదరాబాద్లో అరెస్ట్ చేసిన పోలీసులు.. అదేరోజు మంగళగిరి తీసుకెళ్లారు. ఆ రోజు రాత్రంతా నల్లపాడు పోలీస్స్టేషన్లో ఉంచారు. మంగళవారం ఉదయం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేయించిన అనంతరం కొమ్మినేని శ్రీనివాసరావును మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. దీంతో, మంగళగిరి కోర్టు న్యాయమూర్తి.. కొమ్మినేనికి పద్నాలుగు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. కోర్టు ఉత్తర్వుల అనంతరం కొమ్మినేని శ్రీనివాసరావును తదుపరి చర్యల నిమిత్తం గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు.