Pajero : పజేరో రీఎంట్రీ.. ఫార్చ్యూనర్ ఆధిపత్యానికి ముప్పు?
ఫార్చ్యూనర్ ఆధిపత్యానికి ముప్పు?;
Pajero : ఒకప్పుడు భారత రోడ్లపై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉన్న మిత్సుబిషి పజేరో, దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ మార్కెట్లోకి రాబోతోంది. ఇటీవల దక్షిణ యూరప్లో టెస్టింగ్ చేస్తున్న పజేరో కారు కనిపించింది. కొత్త డిజైన్, ఆధునిక ఇంటీరియర్, విభిన్న ఇంజిన్ ఆప్షన్స్తో ఈ కారు వస్తుందని అంచనా. పజేరో తిరిగి వస్తే, ప్రస్తుతం ఎస్యూవీ సెగ్మెంట్లో అగ్రస్థానంలో ఉన్న టయోటా ఫార్చ్యూనర్ కు గట్టి పోటీ తప్పదని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. మిత్సుబిషి 2002లో హిందుస్థాన్ మోటార్స్తో కలిసి పజేరోను భారతదేశంలో విడుదల చేసింది. 2012లో పజేరో స్పోర్ట్ కూడా వచ్చింది. మంచి ఆదరణ ఉన్నప్పటికీ, కఠినమైన ఎమిషన్ నిబంధనల కారణంగా 2020లో భారతదేశంలో, 2021లో ప్రపంచవ్యాప్తంగా పజేరో అమ్మకాలను మిత్సుబిషి నిలిపివేసింది.
తదుపరి తరం పజేరో తన సంప్రదాయ బాక్సీ డిజైన్ను నిలుపుకుంటూనే, ఎక్సటర్నల్ డిజైన్లో మార్పులు చేసుకోనుంది. స్పై చిత్రాల ప్రకారం, ఇది పొడవైన రూపం, నిటారుగా ఉండే ముందు భాగం, వెడల్పాటి గ్రిల్, నిలువు LED DRLలు, పెద్ద స్కిడ్ ప్లేట్, కొత్త బంపర్లతో కనిపిస్తోంది. కొత్త అల్లాయ్ వీల్స్ 19 లేదా 20 అంగుళాల సైజులో ఉండవచ్చు. వెనుక భాగం నిస్సాన్ పెట్రోల్ను పోలి ఉంటుంది. ఇది మిత్సుబిషి ట్రైటన్ ఛాసిస్పై వస్తే, 2.4-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ (201 బీహెచ్పీ) తో రావొచ్చు. ఇది అవుట్ల్యాండర్ CMF-C/D మోనోకాక్ ఆర్కిటెక్చర్ ఆధారంగా కూడా ఉండొచ్చు. అలాగైతే, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పవర్ట్రెయిన్ (302 బీహెచ్పీ) తో వచ్చే అవకాశం ఉంది. పజేరో తిరిగి రావడం ఎస్యూవీ మార్కెట్లో ఒక కొత్త పోటీని తీసుకురానుంది.