Renault : సొంత కారు కొనాలనుకుంటున్నారా? ఈ కార్ల మీద ఏకంగా రూ.96,000 తగ్గింపు

ఈ కార్ల మీద ఏకంగా రూ.96,000 తగ్గింపు

Update: 2025-09-10 11:54 GMT

Renault : భారత మార్కెట్లో కస్టమర్లకు పెద్ద ఊరట కల్పిస్తూ.. రెనాల్ట్ ఇండియా తమ అన్ని మోడళ్లపై జీఎస్‌టీ 2.0 ప్రయోజనాన్ని బదిలీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పథకంలో కంపెనీకి చెందిన క్విడ్, కైగర్, ట్రైబర్ మోడల్స్ ఉన్నాయి. కొత్త ధరలు సెప్టెంబర్ 22, 2025 నుండి అమల్లోకి వస్తాయి. ఈ చర్యతో రెనాల్ట్, టాటా మోటార్స్, మెర్సిడెస్-బెంజ్, మహీంద్రా వంటి కంపెనీల జాబితాలో చేరింది.

రెనాల్ట్ క్విడ్ ధర ఇప్పుడు రూ.4.30 లక్షల నుంచి రూ.5.90 లక్షల వరకు ఉంటుంది. ఈ మోడల్‌పై రూ.40,095 నుంచి రూ.54,995 వరకు తగ్గింపు లభించింది. బడ్జెట్ సెగ్మెంట్‌లో క్విడ్ ఇప్పుడు మరింత సరసమైనదిగా మారింది. మొదటిసారి కారు కొనేవారికి ఇది ఒక మంచి ఎంపిక.

రెనాల్ట్ కైగర్ ఎస్‌యూవీ ధర ఇప్పుడు రూ.5.76 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. బేస్ వేరియంట్‌పై రూ.53,695 తగ్గింపు ఉండగా, టాప్ వేరియంట్‌పై రూ.96,395 వరకు భారీ తగ్గింపు లభించింది. దీని టాప్ మోడల్ ఇప్పుడు రూ.10.34 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లభిస్తుంది.

రెనాల్ట్ ట్రైబర్ 7-సీటర్ కారు ప్రారంభ ధర కూడా రూ.5.76 లక్షలకు తగ్గింది. బేస్ వేరియంట్‌పై రూ.53,695 తగ్గింపు ఉండగా, టాప్ మోడల్‌పై రూ.80,195 వరకు తగ్గింపు ఇచ్చారు. ఇప్పుడు ట్రైబర్ టాప్ మోడల్ ధర రూ.8.60 లక్షలు.

రెనాల్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్రామ్ మమిల్లపల్లి మాట్లాడుతూ, జీఎస్‌టీ ప్రయోజనాన్ని కస్టమర్లకు పూర్తిగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ చర్య కార్లను మరింత సరసమైనవిగా చేయడమే కాకుండా, పండుగ సీజన్‌లో డిమాండ్‌ను కూడా పెంచుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవల లాంచ్ అయిన కైగర్, ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్‌లు కొత్త స్టైలింగ్, ఫీచర్లతో వస్తున్నాయి. ఇప్పుడు ధరల తగ్గింపుతో, ఈ మోడల్స్ మరింత ఆకర్షణీయంగా మారాయి.

Tags:    

Similar News