గంగమ్మ తీరంలో బడాగణేశ్‌.. ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనం ఘనంగా జరిగింది.

ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనం ఘనంగా జరిగింది.

Update: 2025-09-06 09:48 GMT

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయింది. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని బాహుబలి క్రేన్‌ పాయింట్‌ 4 వద్ద నిమజ్జనోత్సవం జరిగింది. వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తుల జయజయధ్వానాల మధ్య మహాగణపతికి ఘనంగా వీడ్కోలు పలికారు. అంతకుముందు ఉత్సవ సమితి నిర్వాహకులు వినాయకుడికి తుది పూజలు నిర్వహించారు.

ఉదయం 7 గంటలకు బడా గణేశ్‌ శోభాయాత్ర వైభవంగా ప్రారంభమైంది. రాజ్‌దూత్‌ సర్కిల్‌, టెలిఫోన్‌ భవన్‌, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ మీదుగా వినాయకుడు ఎన్టీఆర్‌ మార్గ్‌కు చేరుకున్నాడు. ఈ సందర్భంగా శోభాయాత్ర మార్గంతోపాటు ఎన్టీఆర్‌ మార్గ్‌లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News