Bank Account : ఎస్బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకులో మీకు ఖాతాలున్నాయా.. అయితే మీకో షాక్
అయితే మీకో షాక్;
Bank Account : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా కోటక్ మహీంద్రా బ్యాంక్ అకౌంట్ హోల్డర్లకు అలర్ట్. మెయింటెనెన్స్ పనుల కారణంగా ఈ రెండు బ్యాంకులు ఈ వారం తమ కొన్ని డిజిటల్ బ్యాంకింగ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నాయి. దీనివల్ల ఖాతాదారులు కొంత సమయం పాటు ఈ సేవలను ఉపయోగించుకోలేరు. ఎస్బీఐ డిజిటల్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. ప్రభావితమయ్యే సేవల్లో యూపీఐ, యోనో, ఐఎంపీఎస్, ఏటీఎం, రిటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, రియల్-టైమ్ గ్రాస్ సెటిల్మెంట్, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ వంటివి ఉన్నాయి. ఈ సర్వీసులు నేడు తెల్లవారుజామున అందుబాటులో ఉండవు. అయితే, ఈ సమయంలో కస్టమర్లు యూపీఐ లైట్ను ఉపయోగించవచ్చని ఎస్బీఐ సూచించింది. ఎస్బీఐ తన అధికారిక X అకౌంట్లో పోస్ట్ చేస్తూ అన్ని సేవలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని తెలిపింది.
యూపీఐ లైట్ అనేది ఒక సులభమైన పేమెంట్ సిస్టమ్. ఇందులో రూ.500 కంటే తక్కువ మొత్తంలో జరిగే చిన్న లావాదేవీలను వేగంగా పూర్తి చేయవచ్చు. యూపీఐ లైట్ను ఎలా యాక్టివేట్ చేయాలో ఇక్కడ తెలుసుకోండి. ఉదాహరణకు, మీరు గూగుల్ పే వాడుతున్నట్లయితే, యాప్ను ఓపెన్ చేయండి. అక్కడ మీకు 'యాక్టివేట్ యూపీఐ లైట్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి, అవసరమైన వివరాలు నమోదు చేసి యూపీఐ లైట్ను యాక్టివేట్ చేసుకోవచ్చు.
కోటక్ మహీంద్రా బ్యాంక్
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, కోటక్ మహీంద్రా బ్యాంక్లో మీ ఖాతా ఉన్నట్లయితే, సేవలకు సంబంధించిన షెడ్యూల్ ఇలా ఉంది: జూలై 17, 18 తేదీలలో అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎన్ఈఎఫ్టీ పనిచేయదు. జూలై 20, 21 తేదీలలో అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోతాయి. అలాగే, జూలై 20, 21 తేదీలలో అర్ధరాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు పేమెంట్ గేట్వే సేవలు పనిచేయవు. కాబట్టి, మీకు ఏవైనా ముఖ్యమైన లావాదేవీలు ఉన్నట్లయితే ఈ షెడ్యూల్ను దృష్టిలో ఉంచుకుని ముందుగానే పూర్తి చేసుకోండి.