Britannia : బ్రిటానియా బిస్కెట్లు ఇకా రావా ? దశాబ్ధాల చరిత్ర కలిగిన ఫ్యాక్టరీ మూసివేత!
దశాబ్ధాల చరిత్ర కలిగిన ఫ్యాక్టరీ మూసివేత!;
Britannia :దాదాపు 132 సంవత్సరాలుగా భారతీయులకు సుపరిచితమైన పేరు బ్రిటానియా ఇండస్ట్రీస్. బిస్కెట్ల వంటి ప్రాథమిక ఆహార ఉత్పత్తిలో భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా చేయడంలో కీలక పాత్ర పోషించిన తొలి ఎఫ్ఎంసిజి (FMCG) కంపెనీలలో ఇది ఒకటి. అంతేకాదు, నేడు భారతదేశం నుంచి పెద్ద మొత్తంలో బిస్కెట్లు ఎగుమతి అవుతున్నాయి. అయితే, ఇప్పుడు బ్రిటానియా ఇండస్ట్రీస్ తన అత్యంత పురాతన ఫ్యాక్టరీలలో ఒకదాన్ని మూసివేయబోతోంది. ఈ కర్మాగారానికి దేశ స్వాతంత్ర్యంతో కూడా సంబంధం ఉంది.
బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ (BIL) కోసం మూడు దశాబ్దాలకు పైగా బిస్కెట్లను తయారు చేస్తున్న ఒక కంపెనీని మూసివేయడానికి సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం.. హైకోర్టు 17 ఫిబ్రవరి 2023న ఇచ్చిన ఆదేశానికి వ్యతిరేకంగా హరినగర్ షుగర్ మిల్స్ లిమిటెడ్ (HSML) దాఖలు చేసిన అప్పీల్పై ఈ నిర్ణయం వెలువరించింది. గతంలో, HSML తన ఉద్యోగులకు సద్భావనగా రూ.10 కోట్లు చెల్లించడానికి ముందుకొచ్చింది. కానీ, కోర్టు ఈ మొత్తాన్ని రూ.15 కోట్లకు పెంచింది. ఎనిమిది వారాల్లోపు దానిని చెల్లించాలని ఆదేశించింది.
కోర్టు ఏం చెప్పింది?
"ఈ కంపెనీ మూసివేత వల్ల కొంతమంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోవచ్చు. కొంతమంది ఇతరులు ఎలాంటి తప్పు లేకుండా నిరుద్యోగులు కావచ్చు. ఈ నేపథ్యంలో.. HSML తీసుకున్న ఈ చర్యను మేము అభినందిస్తున్నాం. ఇటువంటి ప్రకటన రికార్డులో నమోదు చేయబడుతుంది" అని కోర్టు వ్యాఖ్యానించింది. HSML తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఉద్యోగులకు చెల్లించే మొత్తాన్ని పెంచడంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని కోర్టుకే వదిలివేశారు.
30 ఏళ్లకు పైగా బిస్కెట్లు తయారు చేస్తున్న ఫ్యాక్టరీ
హరినగర్ షుగర్ మిల్స్ లిమిటెడ్ (HSML) మూడు దశాబ్దాలకు పైగా బ్రిటానియా కోసం కాంట్రాక్టుపై బిస్కెట్లను తయారు చేస్తోంది. బ్రిటానియా 20 నవంబర్ 2019 నుంచి తాజా ఒప్పందాన్ని రద్దు చేసింది. దీని తర్వాత, HSML 28 ఆగస్టు 2019న పారిశ్రామిక వివాద చట్టం, 1947లోని సెక్షన్ 25-O కింద తన కార్యకలాపాలను మూసివేయడానికి దరఖాస్తు చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఈ పాత ఫ్యాక్టరీ ఇక శాశ్వతంగా మూతపడనుంది.