అంతా ప్రణబ్ ముఖర్జీయే చేశారు!!
- నోరు విప్పిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా
- కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థ పతనంపై వివరణ
- అప్పటి ప్రభుత్వం ఆదుకోకపోగా, పరువు తీసింది
- సిబ్బంది సంఖ్య కుదిస్తానంటే ఒప్పుకోలేదు
- ప్రణబ్ ను కలసినా దక్కని ఊరట
- బ్యాంకు రుణాలిప్పిస్తాం పొమ్మన్నారు
- చివరకు సంస్థ మోయలేక ఎత్తేయాల్సి వచ్చింది
- విదేశాలకు పారిపోలేదు..
- బ్యాంకులే మోసగించాయి.. డెబ్ట్ రిమైండర్లు లేవు
- లోక్ సభ ప్రకటనతో పరువు తీశారు
తీసుకున్నరుణాలు రీపే చేయకుండా బ్యాంకులు దివాళా తీయడానికి కారకులైన వ్యాపారుల్లో విజయ మాల్యా ఒకరు. విదేశాల్లో ఉంటూ కోర్టు కేసులు కూడా అటెండ్ కాకుండా దాక్కున్నవిజయ్ మాల్యా ఎట్టకేలకు పెదవి విప్పారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఆపరేషన్స్ కుదించడానికి తాను చేసిన ప్రతిపాదనను అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారంటూ కొత్త విషయం చెప్పుకొచ్చారు.బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన ఆరోపణలతో విదేశాల్లొ ఉంటున్న విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థ దివాళాకు ప్రణబ్ ముఖర్జీయే కారకుడంటూ ఆరోపించారు. ఆ సంస్థ మోయలేని భారంగా పరిణమించిందని దాని సైజును తగ్గించాలని తాను ప్రతిపాదించానని చెప్పారు.
స్వదేశానికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న విజయ్ మాల్యా యూ ట్యూబర్ రాజ్ షామణికి తొలిసారి ఇంటర్వ్యూ ఇచ్చారు.2008లో ప్రపంచం ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొందని తాను కూడా ఆమాంద్యానికి బలయ్యానని అప్పటి వరకూ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థ లాభాల బాటనే పయనించిందని అన్నారు. ఈ మాంద్యం ఫలితం భారత ఆర్థిక శక్తిపై పడిందని ప్రతీ రంగమూదీనివల్ల నష్టపోయిందని అన్నారు.కింగ్ ఫిషర్ సంస్థ నుంచి తనకు రావాల్సిన రిటర్న్లు రాలేదని అన్నారు.క్షీణించిన ఆర్థిక పరిస్థితిని ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ దృష్టికి తీసుకొచ్చానని,కింగ్ ఫిషర్ సంస్థలో ఉద్యోగుల సంఖ్యను కుదిస్తానని, విమానాల సంఖ్యను కుదిస్తానని ప్రతిపాదించానని కానీ అందుకు ప్రణబ్ అంగీకరింలేదన్నారు. కంపెనీని కుదించవద్దన్న ప్రణబ్ బ్యాంకులు ఆదుకుంటాయని అభయమిచ్చి పంపారన్నారు. అయినా పరిస్థితి చక్కబడలేదని విమానాల నిర్వహణ భారమైపోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయానన్నారు.
నాలుగు ఒప్పందాలను సూచించా..
తీసుకున్న రుణం తిరిగి చెల్లించడానికి సొమ్ములేని కారణంగా బ్యాంకులతో రాజీకొచ్చి ఆర్థిక వ్యవహారాలు సెటిల్ చేయడానికి నాలుగు మార్గాలు సూచించినట్లు తెలిపారు. బ్యాంకుల్లో పారదర్శకత లోపించిందని తనకు రుణ తాఖీదులు అసలు అందనేలేదని బొంకారు.తాను 15 సార్లు రిమైండర్లు ఇచ్చినా తనకు వివరాలు ఇవ్వని బ్యాంకుల నుంచి వివరాలు సేకరించిన ప్రభుత్వంతాను 14,131.6 కోట్ల రుణాన్ని ఎగ్గొట్టినట్లు పార్లమెంటులో ప్రకటించిందన్నారు. బ్యాంకులు రూ.9వేల కోట్ల బకాయిల మేరకు ఆస్తులు జప్తు చేసినట్లు వస్తున్న వార్తలను ఖండించారు. డాక్యుమెంట్లలో ఉన్నది రూ.6,203 కోట్లేనన్నారు.తాను తీసుకున్న దానికన్నా ఎక్కువే తిరిగి చెల్లించినా తనపై అపవాదులు, అబద్ధాలు ప్రచారమయ్యాయని భారత్ వచ్చేందుకు సిద్ధమని, కోర్టువిచారణను ఎదుర్కొంటానని ఆరోపణలపై పోరాడతానని అన్నారు.