Insurance : ఇన్సురెన్స్ తీసుకున్న వాళ్లు, వారి నామినీ.. ఇద్దరూ చనిపోతే డబ్బులు ఎవరికి వస్తాయో తెలుసా ?

ఇద్దరూ చనిపోతే డబ్బులు ఎవరికి వస్తాయో తెలుసా ?;

Update: 2025-06-21 03:25 GMT

Insurance : జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 270 మందికి పైగా చనిపోయారు. విమానంలో ఉన్న 242 మందిలో కేవలం ఒక్కరు మాత్రమే బతికారు. ఎయిర్ ఇండియా సంస్థ చనిపోయిన ప్రయాణికుల కుటుంబాలకు అప్పటికప్పుడు రూ.1.25కోట్లు పరిహారం ఇస్తామని చెప్పింది. ఇది ఫ్లైట్ ఇన్సూరెన్స్, అలాగే అంతర్జాతీయ రూల్స్ ప్రకారం ఇస్తున్న పరిహారం. దీనితో పాటు, వాళ్ళ వ్యక్తిగత ఇన్సూరెన్స్ విషయం కూడా ఇప్పుడు ఒక చిన్న కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసింది.

ఈ కన్‌ఫ్యూజన్ ఏంటంటే.. ఈ విమాన ప్రమాదంలో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వ్యక్తి, ఆ డబ్బులు ఎవరికి రావాలని రాశాడో ఆ నామినీ.. ఇద్దరూ చనిపోయిన ఒక కేసు ఉంది. సాధారణంగా, పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోతే నామినీ డబ్బుల కోసం క్లెయిమ్ చేయొచ్చు. కానీ, ఇక్కడ ఇద్దరూ చనిపోయారు.. మరి ఇన్సూరెన్స్ డబ్బులు ఎవరికి వస్తాయి?

ఇలాంటి పరిస్థితిలో సాధారణంగా సక్సెషన్ సర్టిఫికేట్ (వారసత్వ ధృవీకరణ పత్రం) తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఎయిర్ ఇండియా ప్రమాదం చాలా పెద్దది.. సీరియస్ విషయం కాబట్టి, రూల్స్‌ని కొంచెం సడలించారు. ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి, నామినీ ఇద్దరూ చనిపోయినప్పుడు, క్లాస్ వన్ వారసులకు డబ్బులు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఇస్తారు. క్లాస్ వన్ వారసులు అంటే, చనిపోయిన వాళ్ళకు చాలా దగ్గరి రక్త సంబంధీకులు అన్నమాట. అంటే, కొడుకు లేదా కూతురు లాంటి వాళ్ళు. ఒకవేళ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే, అందరూ కూడా ఎవరికి ఎంత వాటా రావాలి అని ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఇలాంటి అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.

మిగిలిన వాళ్ళ విషయంలో, ఇన్సూరెన్స్ డబ్బులు సెటిల్ చేయడానికి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు హెల్ప్ డెస్క్‌లు పెట్టాయి. ఉద్యోగులకు చేయించిన గ్రూప్ ఇన్సూరెన్స్, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, లగేజ్ ఇన్సూరెన్స్ లాంటి చాలా రకాల ఇన్సూరెన్స్‌లు ఉన్నాయి. వీటి కోసం నామినీలు డబ్బుల కోసం క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు ప్రయాణించిన టికెట్, వాళ్ళ డెత్ సర్టిఫికేట్ లాంటి డాక్యుమెంట్లు బంధువులు సమర్పించి, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు.

అలాగే, ఎయిర్ ఇండియా ప్రకటించిన కోటిన్నర రూపాయల పరిహారం, ఈ వ్యక్తిగత ఇన్సూరెన్స్‌తో సంబంధం లేనిది. విమానంలో ఉన్న ప్రయాణికులకు పర్సనల్‌గా కానీ, వాళ్ళు పనిచేసే చోటు నుండి కానీ ఇన్సూరెన్స్ కవరేజ్ లేకపోయినా కూడా, వాళ్ళ కుటుంబాలకు అంతర్జాతీయ చట్టాల ప్రకారం పరిహారం కచ్చితంగా వస్తుంది. అయితే, ఇక్కడ చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులమని నిరూపించే డాక్యుమెంట్లు ఉండాలి.

Tags:    

Similar News