పన్ను ఎగవేతదారుల కోసం ఐటీ శాఖ కొత్త రూల్స్ !!

Update: 2025-06-09 04:15 GMT
  • కరెంట్ ఎక్కౌంట్ లో కోటిరూపాయలు జమ చేస్తే..
  • విదేశీ ప్రయాణాలకు రెండు లక్షలకు మించి ఖర్చు చేస్తే
  • కరెంటు బిల్లుల పేరిట లక్షకు పైగా ఖర్చు చేస్తే
  • ఆ వివరాలు టాక్స్ ఫైలింగ్ లో చేర్చాల్సిందే
  • ఇకపై అల్పదాయ వర్గాలు ఐటీ రిటర్నులు వేయాల్సిందే
  • అనుమానాస్పద ఖర్చులు, చాటుమాటు చెల్లింపులపై నజర్
  • బ్యాంకులు, పోస్టాఫీసులు, ఆర్ధిక సంస్థలతో టై అప్
  • నెలసరి ఆదాయం రెండున్నర లక్షలు దాటితే ఐటీ రిటర్న్స్

పన్ను ఎగ్గొట్టే వారి భరతంపట్టేందుకు ఐటీ శాఖ ఉచ్చుబిగిస్తోంది. ఇకపై కరెంట్ ఎక్కౌంట్ లో కోటి రూపాయలు జమ చేసినా, విదేశీ ప్రయాణాలకు రెండు లక్షలకు మించి ఖర్చు చేసినా,కరెంటు బిల్లుల పేరిట లక్షకు పైగా ఖర్చు చేసినా ఐటీ శాఖకు సమాధానం చెప్పాల్సిందే.టాక్స్ ఫైలింగ్ టైమ్ కావడంతో ఐటీశాఖ ఈ కొత్త నిబంధనలు అమల్లోకి తెస్తోంది.నెలకు రెండున్నర లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారు ఖచ్చితంగా ఇన్ కమ్ టాక్స్ రిటర్నులు దాఖలు చేయాల్సిందే.ఇకపై 2019 ఏప్రిల్ నుంచి అల్పాదాయ వర్గాల వారూ ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలు జరిపితే ఐటీ రిటర్నులు వేయాల్సిందే.కరెంటు ఎక్కౌంట్ లో ఒకేసారి కోటి రూపాయలు జమ చేసినా, రెండు లక్షలకు మించి విదేశీ ప్రయాణాలకు ఖర్చు చేసినా,కరెంటు బిల్లుల పేరిట లక్షకు పైగా చెల్లింపులు జరిపినా అల్పాదాయ వర్గాల వారూ అందుకు లెక్కలు తప్పసనిసరిగా చూపాల్సిందే.

పెద్ద మొత్తం ట్రాన్సాక్షన్స్ అంటే..

పెద్ద మొత్తంలో డిపాజిట్లు,ఆస్తి ఒప్పందాలు, పెట్టుబడులు, ఎక్కువ మొత్తంలో క్రెడిట్ కార్డు చెల్లింపులు జరిపిన వారు ఆ వివరాలను ఐటీ శాఖకు రిపోర్టు చేయాల్సిందే.అసలు ఆదాయ వివరాలు దాచేసి ఇలా చాటు మాటున పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపేవారు ఇక ఐటీ శాఖ చేతికి చిక్కినట్లే. వారి ఆటలు కట్టించడానికే ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తోంది ఐటీ శాఖ.విస్తృత డాటా విశ్లేషణలు, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడుతూ ఇలాంటి వారి వివరాలు పసిగడుతుంది. దీనికోసం ఆర్ధిక సంస్థల సహకారం తీసుకుంటుంది.బ్యాంకులు, పోస్టాఫీసులు, కోఆపరేటివ్స్, ఫిన్ టెక్స్, మ్యుచువల్ ఫండ్స్ సంస్థలను భాగస్వాములను చేసుకుంటూ వారిచ్చే గణాంకాలు, డాటా విశ్లేషణలు, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ సహకారంతో ఐటీ శాఖ విశ్లేషిస్తుంది. ఇకపై పెద్ద మొత్తంలో ఆర్ధిక లావాదేవీలు జరిపేవారు అందుకు సంబంధించిన వివరాలను మే 31 కల్లా సంబంధిత ఆర్ధిక సంస్థలకు వార్షిక నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News