6వేల మంది ఉద్యోగులను ఎందుకు తీసేస్తున్నామో చెప్పిన సత్య నాదెళ్ల

Update: 2025-05-30 11:22 GMT


టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో చోటు చేసుకున్న ఉద్యోగాల తొలగింపు వ్యవహారంపై కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల స్పందించారు. 6 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించడానికి గల కారణాలను కంపెనీ అంతర్గత సమావేశంలో నాదెళ్ల వివరించినట్టు తెలుస్తోంది. ఈ తొలగింపులు వ్యక్తిగత పనితీరు ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు కావని, సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా జరిగాయని ఆయన స్పష్టం చేశారు.



ఇటీవల మైక్రోసాఫ్ట్ సుమారు 6 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. ఇది ఆ సంస్థలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగులలో సుమారు 3 శాతానికి సమానం. ఈ పరిణామం ప్రొడక్ట్, డెవలప్‌మెంట్ డవిభాగాలను కూడా ప్రభావితం చేయడంతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మార్పులు సంస్థలో ఎంత లోతుగా జరిగేలా ఉన్నాయనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇంజనీరింగ్‌ ఉద్యోగాలకు కూడా ఏఐతో ముప్పు తప్పేలా లేదన్న చర్చ నడుస్తోంది. అయితే, ఇదే సమయంలో తమ కో పైలట్ ఏఐ అసిస్టెంట్లను కస్టమర్ల వర్క్‌ఫోర్స్‌లో వేగంగా విస్తారించడంపై మైక్రోసాఫ్ట్‌ ప్రధానంగా దృస్టిపెట్టిందని సత్య నాదెళ్ల స్పష్టం చేశారని చెబుతున్నారు.




Tags:    

Similar News