Nayanthara: నయనతారకు రూ.12 కోట్ల రెమ్యునరేషన్.!
రూ.12 కోట్ల రెమ్యునరేషన్.!
By : PolitEnt Media
Update: 2026-03-03 10:05 GMT
Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా నంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్న నయనతార మరోసారి వార్తల్లో నిలిచారు. కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం టాక్సిక్లో ఆమె 'గంగ' అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. మార్చి 19న వి డుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాల్లో నయనతార గన్ పట్టుకుని కనిపించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో హైప్ తెచ్చింది. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం నయనతార మొదట రూ.18 కోట్ల పారితోషికం డిమాండ్ చేయగా, నిర్మాతలతో చర్చల అనంతరం రూ.12 కోట్లకు అంగీక రించినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తె రకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ, రుక్మిణీ వసంత్ వంటి నటీమణులు ఉన్నప్పటికీ, నయనతార పాత్రే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం...