Jayam Manadera: జయం మనదేరాకి 25 ఏళ్లు

జయం మనదేరాకి 25 ఏళ్లు

Update: 2025-10-07 13:20 GMT

Jayam Manadera: వెంకటేష్ ద్విపాత్రాభినయం చేసిన 'జయం మనదేరా!' సినిమా విడుదలై నేటికి (అక్టోబర్ 7) 25 సంవత్సరాలు పూర్తయింది. ఎన్. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2000 అక్టోబర్ 7న విడుదలైంది.

ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు సౌందర్య, భానుప్రియ కథానాయికలుగా నటించారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి. సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.

కులం, సమాజంలోని అంతరాలపై సందేశాన్ని ఇచ్చే యాక్షన్ డ్రామాగా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా కుల వ్యవస్థ, గ్రామీణ ప్రాంతాల్లో జరిగే అణచివేత, దౌర్జన్యాలపై బలమైన సందేశాన్ని ఇచ్చింది.వెంకటేష్ ఇందులో తండ్రి (మహాదేవ నాయుడు), కొడుకు (అభిరామ్) అనే రెండు పాత్రల్లో నటించి మెప్పించారు. లండన్‌లో పెరిగిన కొడుకు తన తండ్రి చరిత్రను తెలుసుకొని, తన సొంత గ్రామానికి వచ్చి అక్కడి సమస్యలను ఎలా పరిష్కరించాడనేది ప్రధాన కథాంశం.

ఈ చిత్రంలో నటనకు గాను వెంకటేష్ ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు.ఇది బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన చిత్రాలలో ఒకటి."ఆన.. ఆన.. అమ్మ మీద ఆన" అనే వెంకటేష్ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్‌లు బాగా పాపులర్ అయ్యాయి.

Tags:    

Similar News