Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ ఆన్లైన్ వేధింపులు.. విచారణలో ఊహించని ట్విస్ట్..
విచారణలో ఊహించని ట్విస్ట్..
Anupama Parameswaran: ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ తనపై జరుగుతున్న ఆన్లైన్ వేధింపుల కేసులో వెలుగులోకి వచ్చిన నిజం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి, అసభ్యకరంగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసిన అనుపమ, ఇటీవల కేరళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కొంతకాలంగా ఓ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నుంచి, పలు ఫేక్ అకౌంట్ల ద్వారా తన కుటుంబ సభ్యులు, స్నేహితులు సహనటులను లక్ష్యంగా చేసుకుని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అనుపమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
మానసిక వేధింపులు:
ముఖ్యంగా తన ఫొటోలను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేయడంతో తాను తీవ్రంగా మనస్తాపానికి గురైనట్లు తెలిపారు.
నటి ఫిర్యాదు మేరకు పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాల సహాయంతో కొద్ది రోజుల్లోనే నిందితురాలిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ విచారణలో వెలుగు చూసిన నిజం అందరినీ షాక్కు గురిచేసింది:
వేధింపులకు పాల్పడుతున్నది ఎవరూ ఊహించని విధంగా, తమిళనాడుకు చెందిన కేవలం 20 ఏళ్ల యువతి అని తేలింది. నిందితురాలి గురించి తెలుసుకున్న అనుపమ తీవ్ర ఆశ్చర్యానికి లోనయ్యారు.
అనుపమ నిర్ణయం
ఈ పరిణామంపై స్పందించిన అనుపమ పరమేశ్వరన్, ఆ యువతి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆమె పూర్తి వివరాలు పంచుకోవడానికి నిరాకరించారు. "ఆమె వయసు చాలా చిన్నది. తన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వివరాలు వెల్లడించడం లేదు. కానీ, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయను. న్యాయపరంగానే ముందుకెళతాను" అని ఆమె స్పష్టం చేశారు.
ఏది ఏమైనా, ప్రముఖ నటిపై ఆన్లైన్లో వేధింపులకు పాల్పడిన నిందితురాలు అబ్బాయి కాకుండా, ఒక యువతి కావడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది.