ఏపీ సీయంతో సినీ ప్రముఖుల భేటీ వాయిదా

Update: 2025-06-15 04:47 GMT

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ఆదివారం జరగాల్సిన తెలుగు సినీ ప్రముఖల భేటీ వాయిదా పడింది. ముఖ్యమంత్రిని కలవాల్సిన కీలక సినీ ప్రముఖులు సినమా పషూటింగులు, ఇతర ముందుగా షెడ్యూల్‌ అయిన కార్యక్రమాలు ఉన్నందున ఈ భేటీ వాయిదా పడినట్లు చిత్ర పరిశ్రమ వర్గాలు చెపుతున్నాయి. ధియేటర్ల బందు చేయాలని ఎగ్జిబీటర్లు తీసుకున్న నిర్ణయం తరువాత ఏపీ డిప్యూటీ సీయం, తెలుగు సినీ పరిశ్రమకు మధ్య కొంత గ్యాప్‌ ఏర్పడిన పరిస్ధితులు నెలకొన్నాయి. ఈ గ్యాప్‌ ని తగ్గించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి తెలుగు చిత్ర పరిశ్రమకు మధ్య సయోధ్య వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఏపీ సీయం చంద్రబాబు నాయుడిని కలవాలని చిత్ర పరిశ్రమ పెద్దలు నిర్ణయించారు. వాస్తవానికి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిత్రపరిశ్రమ ప్రతినిధులు సీయంను కలవకపోవడంపై డీసీయం పవన్‌ కళ్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీయం చంద్రబాబును కలసి సినీ పరిశ్రమ సమస్యలు ఆయనకు వివరించాలని సినీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆదివారం సాయంత్రం 4 గంటలకు అపాయింట్మెంట్ కూడా ఫిక్స్‌ చేసుకున్నారు. ముందుగా డీసీయం పవన్‌ కళ్యాణ్‌ తో భేటీ అయిన అనంతరం సీయం చంద్రబాబును కలవాలని అనుకున్నారు. కానీ సీయంను కలవాల్సిన కీలక సినీ పరిశ్రమ వ్యక్తులకు ముందుగానే నిర్ణయమైన షూటింగులు ఉన్నందున ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. మరోసారి సీయం అపాయింట్మెంట్‌ ఫిక్స్‌ చేసుకుని సినీ పరిశ్రమకు చెందిన ముప్పై, నలభై మంది ప్రముఖలు అమరావతి వెళ్లి సీయం చంద్రబాబుతో సమావేశం అవ్వాలని భావిస్తున్నారు.

Tags:    

Similar News