Actress Rashmika Mandanna: నటి రష్మిక మందన్నకు తీవ్ర గాయం.. ఆరు వారలు రెస్ట్!

ఆరు వారలు రెస్ట్!

Update: 2026-08-01 07:56 GMT

Actress Rashmika Mandanna: టాలీవుడ్‌లో వరుసగా ప్రముఖ నటీనటులు షూటింగ్‌ల సమయంలో గాయపడుతుండటం ఇండస్ట్రీని ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, నందమూరి బాలకృష్ణల తర్వాత ఇప్పుడు ప్రముఖ నటి రష్మిక మందన్న కూడా ఒక డాన్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

ఇటీవలే రామ్ చరణ్ షూటింగ్ సమయంలో మణికట్టుకు గాయం కావడంతో శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఎన్టీఆర్ భుజం గాయం వల్ల ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటుండగా, 'NBK111' సెట్స్‌లో గాయపడిన బాలకృష్ణ మోకాలి శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్నారు.

ప్రస్తుతం రష్మిక ‘రణబలి’, ‘మైసా’ సినిమాల షూటింగ్‌లలో పాల్గొంటున్నారు. ఈ సినిమాల్లో శారీరకంగా ఎంతో శ్రమతో కూడిన డాన్స్ పర్ఫార్మెన్స్‌లు చేస్తుండగా, ఆమె తొంటి భాగంలో టెండన్ డిటాచ్‌మెంట్ (నరం దెబ్బతినడం) జరిగినట్లు కథనాలు తెలుపుతున్నాయి.

దీంతో వైద్యులు రష్మికను ఆరు వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోమని సూచించారు. తిరిగి షూటింగ్‌లలో పాల్గొనడానికి ముందు, ఆ గాయం పూర్తిగా నయం కావడానికి ఆమె రిహాబిలిటేషన్ (పునరావాస) ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

రష్మిక త్వరగా కోలుకోవాలని, మళ్లీ త్వరలోనే షూటింగ్ సెట్స్‌లో చూడాలని అభిమానులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.

Tags:    

Similar News