Gaddar Awards: గద్దర్ అవార్డ్స్...ఆ హీరోలకు దిల్ రాజు వార్నింగ్
ఆ హీరోలకు దిల్ రాజు వార్నింగ్;
Gaddar Awards: ఇటీవల గద్దర్ అవార్డ్ వేడుక జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకకు పలువురు హీరోలు,హీరోయిన్లు,నటీనటులు హాజరుకాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అటు ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డ్స్ వేడుకకు రాని వారికి ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం అవార్డులిస్తే ఎంతటి వారైనా సరే స్వయంగా వచ్చి తీసుకోవాల్సిందేనని హెచ్చరించారు.
ఏ స్టేట్ వారైనా సరే..షూటింగ్ లో ఉన్నా..మరెక్కడున్నా ఈవెంట్ కు వచ్చి ఎవరి అవార్డ్ వారే స్వీకరించాలని సూచించారు. ప్రభుత్వంతో కలిసి నడవాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీపైన ఉందన్న దిల్ రాజు.. అవార్డ్స్ ఫంక్షన్ ఎప్పుడుందో గుర్తుంచుకుని షూటింగ్ షెడ్యూల్ లో మార్పులు చేసుకుని ఈవెంట్ కు రావాలని సూచించారు. త్వరలో ఏపీలో కూడా అవార్డులు వస్తాయి..వాటిని కూడా బాధ్యతగా స్వీకరించాలని అన్నారు. రెండు రాష్ట్రాలు ఇండస్ట్రీకి రెండు కళ్లలాంటివని చెప్పారు.
గత ఆరు నెలల నుంచి గద్దర అవార్డ్స్ కోసం చాలా గ్రౌండ్ వర్క్ చేసి నిన్న అవార్డ్స్ ఇచ్చామని చెప్పారు. అవార్డ్స్ వేడుకకు వచ్చిన నటీనటులకు అందరికీ స్పెషల్ థ్యాంక్స్ తెలిపారు దిల్ రాజు..ప్రోగ్రామ్ లో చిన్నచిన్న పొరపాట్లు జరిగినట్లు నా దృష్టికి వచ్చింది..కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అవి జరిగాయి..ఎవరైనా హర్టయి ఉంటే క్షమించాలని దిల్ రాజు అన్నారు.