Nayanthara: నిన్ను ప్రతిక్షణం ప్రేమిస్తూనే ఉంటా:నయతార

ప్రతిక్షణం ప్రేమిస్తూనే ఉంటా;

Update: 2025-06-09 09:31 GMT

Nayanthara:కోలివుడ్ నటి నయనతార,డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ల పెళ్లి రోజు ఈరోజు. మూడు సంవత్సరాల క్రితం 2022 జూన్ 9న వీళ్లిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే.ఇవాళ మూడో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఈసందర్బంగా నయనతార తన ఇన్ స్టాలో భర్తతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసి విఘ్నేష్ శివన్ పై ఉన్న ప్రేమను వెల్లడించింది.

ఎవరు మరొకరిని ఎక్కువగా ప్రేమిస్తారో! మీకెప్పటికీ ఈ విషయంలో సమాధానం దొరకకపోవొచ్చు. నీ ప్రేమను ఎలా వర్ణించాలో నాకు తెలియదు.. నా మనసు కోరుకునేదంతా నిన్ను.. నీ ప్రేమనే. ఇద్దరిగా ప్రారంభమైన మన ప్రయాణం నలుగురుగా మారింది. ఇంతకు మించి కోరుకోవడానికి ఏముంది.. స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందో నువ్వు నాకు చూపించావు. నా జీవితభాగస్వామికి పెళ్లిరోజు శుభాకాంక్షలు.. నిన్ను ప్రతిక్షణం ప్రేమిస్తుంటాను అని నయనతార తెలిపింది.నయన్ కు ఇద్దరు పిల్లలు ఉయిర్, ఉలగం అనే కవల పిల్లలు ఉన్నారు. వీరిద్దరూ కూడా సరోగసీ ద్వారా జన్మించారు. నయన తార ప్రస్తుతం తెలుగులో అనిల్ రావిపూడి చిరంజీవి కాంబోలో వస్తున్న మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.

Tags:    

Similar News