Janhvi Kapoor: పెళ్లిపై జాన్వీ కపూర్ క్లారిటీ.. ఏమన్నదంటే..?
ఏమన్నదంటే..?
Janhvi Kapoor: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన పెళ్లి గురించి వస్తున్న పుకార్లపై మొదటిసారిగా స్పందించారు. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, తన దృష్టి మొత్తం కెరీర్పైనే ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో శిఖర్ పహారియాతో ఆమె పెళ్లి అంటూ వస్తున్న ప్రచారానికి ప్రస్తుతానికి ముగింపు పడింది.
పెళ్లి ప్రశ్న.. జాన్వీ సమాధానం
వరుణ్ ధావన్తో కలిసి జాన్వీ నటిస్తున్న 'సన్నీ సంస్కారి కీ తులసి కుమారి' సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు నేరుగా "మీ పెళ్లి ఎప్పుడు?" అని ప్రశ్నించగా.. ఏ మాత్రం తడుముకోకుండా జాన్వీ సమాధానం చెప్పారు. "ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం నటనపైనే ఉంది. పెళ్లికి ఇంకా చాలా సమయం ఉంది" అని ఆమె తెలిపారు.
రిలేషన్షిప్ పుకార్లు..
గత కొన్నాళ్లుగా జాన్వీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ పలు కార్యక్రమాల్లో కలిసి కనిపించడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. గతంలో తన ఫోన్లో స్పీడ్ డయల్ లిస్ట్లో తన తండ్రి బోనీ కపూర్, సోదరి ఖుషీ తర్వాత శిఖర్ పేరు ఉందని జాన్వీ చెప్పడం, 'శిఖు' అని రాసి ఉన్న నెక్లెస్ ధరించడం వంటి సంఘటనలు ఈ వదంతులకు దారితీశాయి.
తాజా ఈవెంట్లో జాన్వీ శిఖర్ పేరును ప్రస్తావించకపోయినా, తన పెళ్లి గురించి నేరుగా స్పందించి, రూమర్స్కు చెక్ పెట్టారు. శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సన్నీ సంస్కారి కీ తులసి కుమారి' చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది.