Kubera: బాక్సాఫీస్ వద్ద కుబేర ర్యాంపేజ్!
కుబేర ర్యాంపేజ్!;
Kubera: స్టార్ హీరోలు ధనుష్, నాగార్జున కలిసి నటించిన లేటెస్ట్ మూవీ ‘కుబేర’. రష్మిక మందన్నా హీరోయిన్. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో సోషల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ టాక్ తో దూసుకెళ్తుంది. రోజురోజుకు ఈ చిత్రం అనూహ్యంగా బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటుతుండటంతో.. వసూళ్ల పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పటికే కేవలం రెండు రోజుల్లోనే యాభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను దాటేసింది. మూడో రోజు కూడా భారీ వసూళ్లు రావడంతో 100 కోట్లకు చేరువైనట్లు సమాచారం. అయితే, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తనదైన రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తాంది. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షోలో కుబేరకి సంబంధించి ఏకంగా 1 మిలియన్ ప్లస్ టికెట్లు అమ్ముడైనట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. దీంతో, బాక్సాఫీస్ దగ్గర కుబేర ర్యాంపేజ్ మామూలుగా లేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం మెసేజ్ చేస్తూ.. 'కుబేర సినిమాతో థియేటర్లు ఉత్సాహంగా ఉన్నాయి, ప్రేక్షకుల హృదయాలు గర్జిస్తున్నాయి, స్క్రీన్లు వెలిగిపోతున్నాయి. ఇది అద్భుతమైన మెగా బ్లాక్ బస్టర్' అంటూ పోస్ట్ చేసింది.