Chennai:విశాల్ కు మద్రాస్ హైకోర్టు షాక్

విశాల్ కు షాక్;

Update: 2025-06-06 10:55 GMT

Chennai: రుణ ఉల్లంఘన కేసులో నటుడు విశాల్ కు ఎదురుదెబ్బ తగిలింది. చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ 30 శాతం వడ్డీతో సహా రూ.21.90 కోట్లు తిరిగి ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. దీనికి తోడు, కోర్టు ఖర్చులను కూడా నటుడినే భరించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

విశాల్ తన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ కోసం ఫైనాన్షియర్ జి.ఎన్. అన్బు చెళియన్ కు చెందిన గోపురం ఫిల్మ్స్ వద్ద రెండేళ్ల క్రితం రూ.21.29 కోట్ల రుణం తీసుకున్నాడు. ఆ తరువాత గోపురం ఫిల్మ్స్‌ను లైకా ప్రొడక్షన్స్ కొనుగోలు చేసింది. దీనితో రుణం పూర్తిగా తిరిగి చెల్లించే వరకు విశాల్ నిర్మించే చిత్రాల హక్కులను లైకా ప్రొడక్షన్స్ కు చెందుతాయని ఒప్పందం కుదిరింది. అయితే విశాల్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి తన సినిమా సామాన్యుడు మూవీని ఇతర సంస్థలకు అమ్మాడని లైకా హైకోర్టును ఆశ్రయించింది.

ఈ కేసును విచారించిన హైకోర్టు.. విశాల్ రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని, తన ఆస్తుల వివరాలను కోర్టుకు సమర్పించాలని సూచించింది. అయితే విశాల్ ఈ ఆదేశాలను పాటించకపోవడంతో లైకా ప్రొడక్షన్స్ కోర్టు ధిక్కరణ కేసును దాఖలు చేసింది. దీనిపై విశాల్‌ను మందలించిన న్యాయస్థానం..తన ఆస్తుల వివరాలను దాఖలు చేయాలని ఆదేశించింది.

ఇక రెండున్నరేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం, మద్రాస్ హైకోర్టు లైకా ప్రొడక్షన్స్‌కు అనుకూలంగా త‌న తీర్పును వెల్లడించింది. దాదాపు రూ.21.29 కోట్ల అసలు మొత్తంతో పాటు 30 శాతం వడ్డీ, అలాగే న్యాయపరమైన ఖర్చులను కలిపి మోత్తం లైకాకు చెల్లించాలని నటుడు విశాల్‌ను ఆదేశించింది.

Tags:    

Similar News