Chiranjeevi: నేను ఓటీటీకి రెడీ అంటున్న మెగాస్టార్

రెడీ అంటున్న మెగాస్టార్;

Update: 2025-06-24 05:07 GMT

Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్నా డు చిరంజీవి. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఏడు పదుల వయసులోనూ ఇప్పటికీ వెండితెరపై కనువిందు చేస్తున్నాడు. పునాదిరాళ్లు మూవీతో 1978లో ఆయన నటజీవితం మొదలైంది. చిరు నటించిన స్వయంకృషి సినిమా రష్యన్ భాషలోకి అనువాదమై మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. తన నట జీవితంలో ఎన్నో అవార్డులు అందుకున్నా డు. నంది అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు 2006లో పద్మ భూషణ్, 2024లో పద్మ విభూషణ్ పురస్కారాలు ఆయనను వరించాయి. తన 45 ఏళ్ల కెరీర్లో 156 సినిమాల్లో నటించిన మెగాస్టార్ 537 పాటల్లో 24 వేల డ్యాన్స్ స్టెప్పులకు గాను గత ఏడాది గిన్నిస్ బుక్ రికార్డ్ లోకి చేరిపోయాడు. వెండితెర చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్న ఆయన ఓటీటీలో సినిమాలు చేసేందుకు కూడా రెడీ అంటున్నాడు. తాజాగా కుబేర సక్సెస్ మీట్ లో నాగార్జునతో కలిసి పాల్గొన్న చిరు ఓటీటీ విషయంలో కింగ్ నాగ్ తీసుకున్న నిర్ణయం తనకు స్పూర్తి అన్నాడు. దీంతో చిరును ఓటీటీలో చూడొచ్చని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న ప్రాజెక్ట్స్ పూర్తయిన తర్వాత ఓటీటీ ఎంట్రీ కి సంబంధించి ఓ అధికారిక ప్రకటన వస్తుందా అన్నది వేచి చూడాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు విశ్వంభర చిత్రంతోపాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది.

Tags:    

Similar News