ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ను కలుస్తానంటోన్న మిస్‌ అమెరికా అథెన్నా

Update: 2025-05-20 11:48 GMT

టాలీవుడ్‌ టాప్‌ యాక్టర్లు ఎన్టీయార్‌, అల్లు అర్జున్‌ను కలిసేందుకు, వాళ్లతో మూవీ బిజినెస్‌ గురించి మాట్లాడేందుకు ఆసక్తిగా ఉందన్నారు మిస్‌ అమెరికా అథెన్నా క్రాస్బీ. మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన అథెన్నా.. ప్రస్తుతం తెలంగాణ టూరిజాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే పొలిటెంట్‌ మీడియాకు ఆమె స్పెషల్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. అల్లు అర్జున్‌, జూనియర్‌ ఎన్టీయార్‌లను మిస్‌ వరల్డ్‌ పోటీలకు ఆహ్వానించానని, వాళ్లతో ప్రత్యేకంగా పలు అంశాలు చర్చించాలని ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. హాలీవుడ్‌లో తన కెరీర్‌ను కొనసాగించాలన్న ఆసక్తిని వెల్లడించారు అథెన్నా క్రాస్బీ.



భారత్‌లో ఈ టూర్‌ను ఎన్నటికీ మర్చిపోలేనన్నారు. ప్రత్యేకంగా తెలంగాణలోని సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, ఇక్కడి ఘన చరిత్రను ఆమె ప్రశంసించారు. చార్మినార్‌తో పాటు.. అక్కడి లాడ్‌ బజార్‌ను సందర్శించడం, రామప్ప దేవాలయం దర్శనం మరిచిపోలేనన్నారు.



భారత సంస్కృతిని అనుభవించడానికి తాను చీర ధరించానని అథెన్నా చెప్పారు. అలాగే, తాను ఇక్కడికి వచ్చే ముందే.. కొన్ని తెలుగు పదాలు, భారతీయ సాంస్కృతిక స్టెప్స్‌ నేర్చుకున్నట్లు చెప్పారు. భారతీయ భోజనాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నాననీ, ముఖ్యంగా బిర్యానీ తనకు ఎంతగానో నచ్చిందన్నారు.


Tags:    

Similar News