Mysore Sandal: మైసూర్ శాండల్ సరికొత్త ప్రస్థానం.. బ్రాండ్ అంబాసిడర్గా తమన్నా..
బ్రాండ్ అంబాసిడర్గా తమన్నా..
Mysore Sandal: కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థ కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ తన ఐకానిక్ బ్రాండ్ మైసూర్ శాండల్ సోప్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రముఖ సినీ నటి తమన్నా మంగళవారం నుంచి అధికారికంగా సంస్థ బ్రాండ్ అంబాసిడర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.
సరికొత్త రూపంలో మైసూర్ శాండల్:
వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన మైసూర్ శాండల్ సోప్ను యువతను ఆకర్షించేలా ఆధునిక రీప్యాకేజింగ్తో మార్కెట్లోకి తిరిగి విడుదల చేశారు. తమన్నా రెండేళ్ల పాటు కేఎస్డీఎల్ ఉత్పత్తులకు ప్రచారం చేయనున్నారు. ఈ కాలంలో ఆమె ఇతర ప్రైవేట్ సంస్థలకు చెందిన సబ్బులు లేదా సంబంధిత ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరించకూడదనే నిబంధన ఉంది.
టర్నోవర్ లక్ష్యం: 2030 నాటికి కంపెనీ టర్నోవర్ను రూ. 5,000 కోట్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 2,000 కోట్లకు చేరుతుందని అంచనా.
ఉత్తర భారత మార్కెట్పై దృష్టి:
సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న తమన్నా ద్వారా ఉత్తర భారతదేశం, మధ్య భారతదేశంలో మైసూర్ శాండల్ అమ్మకాలను భారీగా పెంచాలని మంత్రి ఎం.బి. పాటిల్ వెల్లడించారు.
విస్తరణ ప్రణాళికలు:
విజయపుర, దాబస్పేటల్లో కొత్త ఉత్పత్తి యూనిట్లను ప్రారంభించడంతో పాటు ప్రస్తుతం రూ.30 కోట్లుగా ఉన్న ఎగుమతులను రెట్టింపు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
గత ఏడాది మే నెలలో తమన్నాను బ్రాండ్ అంబాసిడర్గా నియమించినప్పుడు, స్థానిక కన్నడ నటీమణులను కాదని ఆమెను ఎంచుకోవడంపై కొన్ని కన్నడ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ, మార్కెట్ విస్తరణే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంది.