Rajamouli: వీడియో గేమ్ లో రాజమౌళి

గేమ్ లో రాజమౌళి;

Update: 2025-06-25 14:49 GMT

Rajamouli: ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు ఓ వీడియో గేమ్లోకి అడుగుపెట్టాడు. ప్రముఖ జపాన్ గేమ్ డెవలపర్ హిడియో కొజిమా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'డెత్ స్టాండింగ్ 2: ఆన్ ది బీచ్ వీడియో గేమ్ లో జక్కన్న, అతడి కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ క్యామియో రోల్ పోషించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తు తం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి.

ఇందులో ప్రధాన పాత్రల్లో నార్మన్ రీడస్, ఎల్లీ ఫానింగ్, లియా సెడౌక్స్ లాంటి ప్రముఖ హాలీవుడ్ నటులు నటిస్తున్నారు. ఇది రేపు ప్లేస్టేషన్ 5 కి ప్రత్యేకంగా విడుదల కాబోతోంది. కాగా.. ఈ గేమ్ కు ముందుగానే యాక్సెస్ పొందిన కొందరు ప్లేయర్లు, గేమ్లో రాజమౌళిని 'ది అడ్వెంచరర్'గా, కార్తికేయను 'అడ్వెంచర్ సన్ గా గుర్తించినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి.

మరోవైపు ప్రస్తుతం రాజమౌళి మహేశ్ బాబు ఎస్ఎస్ఎంబీ 29 సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ ఇప్పటికే పలు షెడ్యూళ్లు పూర్తి చేసుకుంది. తాజాగా నీటిలో ఓ భారీ బోట్ యాక్షన్ సీక్వెన్సును చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో మహేశ్, ప్రియాంక, పృథ్వీరాజ్ పాటు దాదాపు 3వేల మంది జూనియర్ ఆర్టిస్ట్లు పాల్గొననున్నారని తెలుస్తోంది.

Tags:    

Similar News