Rajinikanth Sets All-Time Record: కూలీ’ సినిమాకు రజినీ రెమ్యునరేషన్ ఆల్ టైమ్ రికార్డ్..!
ఆల్ టైమ్ రికార్డ్..!;
Rajinikanth Sets All-Time Record: సూపర్స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’ విడుదలకు ముందే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల భారీ పారితోషికాలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలు బయటపడ్డాయి.
రజినీకాంత్ పారితోషికం రూ. 200 కోట్లు!
ఈ చిత్రంలో 'దేవా' అనే పాత్ర పోషిస్తున్న సూపర్స్టార్ రజినీకాంత్, మొదట రూ.150 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్లు జరగడంతో నిర్మాతలు ఆయన పారితోషికాన్ని ఏకంగా రూ. 200 కోట్లకు పెంచినట్లు సమాచారం. ఇది భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ పారితోషికాల్లో ఒకటిగా నిలిచింది.
భారీ తారాగణం, పారితోషికాలు:
‘కూలీ’లో ఇతర నటీనటుల పారితోషికాలు కూడా భారీగానే ఉన్నాయి.
దర్శకుడు లోకేష్ కనగరాజ్కు రూ. 50 కోట్లు.
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్కు రూ. 15 కోట్లు.
టాలీవుడ్ స్టార్ నాగార్జున ('సైమన్' పాత్ర)కు రూ. 10 కోట్లు.
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కు రూ. 20 కోట్లు.
సత్యరాజ్, కన్నడ స్టార్ ఉపేంద్రకు చెరో రూ. 5 కోట్లు.
శ్రుతిహాసన్ రూ. 4 కోట్లు తీసుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
అడ్వాన్స్ బుకింగ్స్లో ‘కూలీ’ దూకుడు:
కూలీ అడ్వాన్స్ బుకింగ్స్లో ఇప్పటికే రూ. 14 కోట్లు వసూలు చేసింది. ఇదే సమయంలో విడుదలవుతున్న హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'వార్ 2' కేవలం రూ. 2.08 కోట్లు మాత్రమే రాబట్టింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి సుమారు 6 లక్షల టిక్కెట్లు అమ్ముడైనట్లు, బ్లాక్ సీట్లను కూడా కలుపుకుంటే ఈ మొత్తం రూ. 20 కోట్లకు చేరువలో ఉందని నివేదికలు చెబుతున్నాయి.
విడుదల తేదీ, బాక్సాఫీస్ పోరు:
కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న 'కూలీ' ఈ నెల 14న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజు 'వార్ 2' కూడా విడుదలవుతుండటంతో, బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాల మధ్య హోరాహోరీ పోరు తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అంచనాలను నిజం చేస్తూ 'కూలీ' ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.