రజనీకాంత్ కూలీకి తెలుగులో మస్త్ డిమాండ్

Update: 2025-06-25 04:20 GMT

రజనీకాంత్ నటిస్తున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కూలీ’ చిత్రం తెలుగు థియేటర్ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమా లో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్ వంటి తారలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మల్టీస్టారర్ ఆగస్ట్ 14న విడుదల కానుంది, దీంతో టాలీవుడ్‌లో రైట్స్ కోసం పోటీ తీవ్రంగా ఉంది.

ముగ్గురు ప్రముఖ నిర్మాతల ఒప్పందం

కూలీ’ తెలుగు థియేటర్ రైట్స్‌ను ఆసియన్ సునీల్, సురేష్ బాబు, దిల్ రాజు ముగ్గురు కలిసి సొంతం చేసుకున్నారని సమాచారం. ఈ రైట్స్ కోసం పలువురు ప్రముఖ నిర్మాతలు, సంస్థలు పోటీపడ్డాయి. గతంలో రజనీకాంత్ ‘జైలర్’ చిత్రాన్ని ఆసియన్ సినిమాస్ డిస్ట్రిబ్యూట్ చేసి భారీ లాభాలు ఆర్జించిన నేపథ్యం ఈ ఒప్పందంలో కీలకంగా మారింది.44 కోట్ల ఒప్పందం వివరాలు: ఈ ఒప్పందం ప్రకారం, ‘కూలీ’ తెలుగు రైట్స్ 44 కోట్ల రూపాయలు (జీఎస్టీ మినహా)కు ఖరారైనట్లు తెలుస్తోంది. బ్రేక్-ఈవెన్ చేరుకోవాలంటే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. రజనీకాంత్ బ్రాండ్, లోకేష్ మార్క్ యాక్షన్‌తో ఈ లక్ష్యం సాధ్యమవుతుందని నిర్మాతలు ధీమాగా ఉన్నారు

Tags:    

Similar News