Jakkanna: పీసీ, ప్రిన్స్ మధ్య రొమాన్స్.. లిమిట్స్ దాటేస్తున్న జక్కన్న
లిమిట్స్ దాటేస్తున్న జక్కన్న;
Jakkanna: ఎస్ఎస్ఎంబీ 29లో హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. సాధారణంగా రాజమౌళి సినిమాల్లో రొమాన్స్ కనిపించదు. కానీ ఈ సినిమా కోసం జక్కన్న తనకు తానుగా పెట్టుకున్న లిమిట్స్ దాటేశాడనే టాక్ వస్తోంది. రాజమౌళి ఫోకస్ అంతా పాత్రలు..కథపైనే పెట్టి పనిచేస్తాడు. అవసరమైతే అర గంట సినిమా నిడివి పెంచు తానంటాడు తప్ప! బోల్డ్ సన్నివేశాలు తనవల్ల కాదంటాడు. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ సినిమాలు చూస్తే అందరికీ అర్థమవుతుంది. కానీ ఎస్ ఎస్ ఎంబీ 29 లో మాత్రం హీరోహీరో యిన్ మధ్య రొమాన్స్ డిమాండ్ చేస్తోందట. ఆఫ్రికన్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ కావడం.. కథ చాలా వరకూ అడవిలో సాగుతుంది. పైగా అడ్వెంచర్ థ్రిల్లర్. సోలోగా సాగే కౌబోయ్ ప్రయాణంలో మెరుపులా తారసపడిన ప్రియాంక మధ్య పరిచయ సన్నివే శాల్లోనే కొంత రొమాన్స్ రాసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూళ్ల షూటింగ్ పూర్తయింది. నెక్స్ట్ షెడ్యూల్ కెన్యాలో ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా రామోజీ ఫిలిం సిటీ లో... షూటింగ్ జరుపుకునేందుకు సిద్ధం అవుతోందట. ఈ మేరకు చిత్ర బృందం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో కొత్త ప్రచారం జరుగుతోంది. అయితే రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమా కోసం... ప్రత్యేక సెట్ ఏర్పాటు చేయబోతున్నారట.వారణాసి నగరాన్ని తలపించేలా భారీ సెట్స్ వేశారని భోగట్టా. ఈ సెట్స్కు రూ. 40 కోట్లకు పైనే అయ్యిందని టాక్. అంతేకాదు... ఈ సినిమాలోని మేజర్ సన్నివేశాల చిత్రీకరణ ఈ సెట్స్లోనే జరుగుతుందని, అందుకే ఈ స్థాయిలో ఖర్చుపెట్టారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత టీమ్ ఫారిన్కి వెళుతుందని, అక్కడి ఫారెస్ట్ లొకేషన్స్లో యాక్షన్ సీక్వెన్స్లను ΄్లాన్ చేశారనే టాక్ వినిపిస్తోంది