Tirumala: తిరుమల శ్రీవారి సేవలో వెటరన్ హీరోయిన్లు..
శ్రీవారి సేవలో వెటరన్ హీరోయిన్లు..;
By : PolitEnt Media
Update: 2025-06-16 06:37 GMT
Tirumala: మాజీ మంత్రి సినీ నటి రోజా, మీనా, ఇంద్రజ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం తెల్లవారు జామున వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అనంతరం ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం తీసుకున్నారు. స్వామివారు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ ముగ్గురు హీరోయిన్స్ 1990-2000 మధ్య వరుస సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.