‘Vishwanath & Sons’ : బాక్సాఫీస్ వద్ద 'విశ్వనాథ్ అండ్ సన్స్' హవా: అమెరికాలో ఒక లక్షకు పైగా టిక్కెట్లు
ఒక లక్షకు పైగా టిక్కెట్లు
‘Vishwanath & Sons’ : కోలీవుడ్ నటుడు సూర్య కథానాయకుడిగా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. సూర్య కెరీర్లో మరో భారీ విజయాన్ని అందించిన ఈ ఫ్యామిలీ డ్రామా, అమెరికా (USA) మార్కెట్లో దర్శకుడు వెంకీ అట్లూరి కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. వీక్డేస్లో కూడా ఈ సినిమా అదే జోరును కొనసాగిస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
చిత్ర నిర్మాతలు వెల్లడించిన అధికారిక వివరాల ప్రకారం, 'విశ్వనాథ్ అండ్ సన్స్' కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను దాటేసింది. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా ఇప్పటివరకు ఒక లక్షకు పైగా టిక్కెట్లు అమ్ముడై రేర్ ఫీట్ సాధించింది. ఎన్ఆర్ఐ (NRI) ప్రేక్షకుల నుంచి వస్తున్న విశేష స్పందన, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కథాంశం ఈ స్థాయి విజయాన్ని అందించాయని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఈ చిత్రంలో మమితా బైజూ కథానాయికగా నటించగా, రాధికా శరత్కుమార్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సీతారా ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.