Tomorrow is Sankatahara Chaturthi: రేపే సంకటహర చతుర్థి: మీ కష్టాలు తొలగి, ఆర్థికాభివృద్ధి కలగాలంటే ఈ పనులు తప్పక చేయండి
మీ కష్టాలు తొలగి, ఆర్థికాభివృద్ధి కలగాలంటే ఈ పనులు తప్పక చేయండి
Tomorrow is Sankatahara Chaturthi: హిందూ ధర్మంలో ఏ శుభకార్యం ప్రారంభించినా మొదట పూజించేది విఘ్నేశ్వరుడినే. సంకటం అంటే కష్టం, హర అంటే తొలగించడం. మన జీవితంలోని కష్టాలను కూకటివేళ్లతో పెకిలించి వేసే పవిత్రమైన రోజే సంకటహర చతుర్థి. ఈ ఏడాది ఏప్రిల్ 5, ఆదివారం నాడు ఈ పర్వదినం రావడం విశేషం. ఈ ప్రత్యేక రోజున మీ ఆర్థిక ఇబ్బందులు తొలగి, వ్యాపార, విద్యారంగాల్లో విజయం సాధించడానికి పాటించవలసిన 5 ముఖ్యమైన పరిహారాలు ఇవే:
ఆర్థిక వృద్ధి కోసం పెసరపప్పు పరిహారం
మీ జాతకంలో బుధుడు బలహీనంగా ఉండి, వ్యాపారంలో నష్టాలు వస్తుంటే ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. గుప్పెడు పచ్చి పెసరపప్పు తీసుకుని, కొత్త ఆకుపచ్చని వస్త్రంలో కట్టండి. దీనిని ఎవరికీ తెలియకుండా వినాయక ఆలయ మెట్లపై ఉంచడం వల్ల వ్యాపార అడ్డంకులు తొలగి, ధన ప్రవాహం పెరుగుతుంది.
అప్పుల విముక్తికి గరిక పూజ
వినాయకుడికి అత్యంత ప్రీతికరమైనది గరిక. 21 గరిక పోచలతో చిన్న చిన్న ముడులు కట్టి స్వామివారికి సమర్పించండి. దాంతో పాటు బెల్లాన్ని నైవేద్యంగా పెడితే, త్వరలోనే మీరు అప్పుల బాధల నుండి విముక్తి పొందుతారు.
జ్ఞాపకశక్తి పెరుగుదలకు వన్ని ఆకులు
విద్యార్థులు, కొత్త పనులు ప్రారంభించే వారు వినాయకుడిని శమి ఆకులతో పూజించాలి. వన్ని చెట్టుకు దైవిక శక్తి ఉంటుంది. ఈ ఆకులతో పూజించడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా, ఇంట్లోని దరిద్రం తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది.
విజయ ప్రాప్తికి మందార పూజ
ఎరుపు రంగు శక్తికి చిహ్నం. ఆదివారం వచ్చే ఈ చతుర్థి నాడు గణపతికి ఎర్రటి మందార పూలను సమర్పించి పూజిస్తే, మీరు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం వరిస్తుంది.
అడ్డంకులు తొలగించే గోపూజ
గణేశుడికి సమర్పించిన మోదకాలు లేదా బెల్లాన్ని పూజానంతరం ఆవుకు ఆహారంగా ఇవ్వండి. గణేశ పూజతో పాటు గోమాత ఆరాధన కలిపి చేయడం వల్ల జీవితంలో చాలా కాలంగా పీడిస్తున్న సమస్యలు తొలగిపోయి, కొత్త అవకాశాలు తలుపు తడతాయి.
ఉపవాస నియమాలు మరియు విశిష్టత
ఉపవాసం: ఉదయాన్నే స్నానం చేసి ఉపవాసం ప్రారంభించాలి. శక్తి లేని వారు పాలు, పండ్లు తీసుకోవచ్చు.
చంద్ర దర్శనం: సంకటహర చతుర్థి ఉపవాసంలో అత్యంత ముఖ్యమైనది రాత్రి చంద్రుడిని చూడటం. చంద్రోదయం తర్వాత చంద్రుడిని దర్శించుకుని, గణపతికి ప్రార్థనలు చేసిన తర్వాతే ఉపవాసం విరమించాలి.
ప్రాముఖ్యత: సాక్షాత్తు పరమశివుడే త్రిపురాసుర సంహారానికి వెళ్లే ముందు గణపతిని పూజించడం మరచి రథం విరిగిపోవడంతో, తిరిగి విఘ్నేశ్వరుడిని ఆరాధించి విజయం సాధించారని పురాణాలు చెబుతున్నాయి.