Ayodhya Ram Temple: అయోధ్య రామమందిరం: విరాళాల చోరీ కేసులో చంపత్ రాయ్ రాజీనామా ఆమోదం.. కొత్త ప్రధాన కార్యదర్శిగా బజరంగ్ బాగ్రా

కొత్త ప్రధాన కార్యదర్శిగా బజరంగ్ బాగ్రా

Update: 2026-07-06 14:00 GMT

Ayodhya Ram Temple: అయోధ్యలో రామమందిర విరాళాల చోరీ ఘటన వెలుగులోకి రావడంతో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. ట్రస్ట్ సమావేశంలో ఆయన రాజీనామాను ఆమోదించారు.

ఈ కీలక సమావేశంలో రామమందిర నిర్వహణ, భవిష్యత్ చర్యలు, నూతన పరిపాలనా వ్యవస్థ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. మరోవైపు, విశ్వ హిందూ పరిషత్ (VHP) సీనియర్ నేత బజరంగ్ బాగ్రాను కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమించే సమాచారం వెలువడింది.

అయోధ్య విరాళాల దుర్వినియోగం కేసులో చంపత్ రాయ్ డ్రైవర్ సహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో మరిన్ని వ్యక్తుల పాత్ర ఉందా అనే అంశంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.

ట్రస్ట్ ఛైర్మన్ నృత్య గోపాల్ దాస్ స్పందన:

ఆలయ విరాళాల చోరీ వార్తలు తనను తీవ్ర వేదనకు గురి చేశాయని ట్రస్ట్ ఛైర్మన్ నృత్య గోపాల్ దాస్ తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, నేరంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెడతామన్నారు. బాధ్యులందరికీ కఠిన శిక్ష విధించాలని సిట్ అధికారులను కోరారు.

Tags:    

Similar News