ఉత్తరఖండ్ లో హెలికాప్టర్ ప్రమాదం... ఏడుగురు మృతి

Helicopter accident in Uttarakhand state… Six pilgrims including the pilot died;

Update: 2025-06-15 09:02 GMT

ఉత్తరఖండ్లో ఆదివారం ఉదయం హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్కు భక్తులతో వెళ్తోన్న హెలికాప్టర్ కూప్పకూలింది. గుప్తకాశీ సమీపంలో గౌరీకుండ్ అడవుల్లో ఈ ప్రమాదం జరిగింది. గౌరికుండ్-త్రిజుగి నారాయణ్ మధ్య జరిగిన ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. హెలికాప్టర్లో ఆరుగురు భక్తులు, పైలట్ ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఆర్యన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా కూలినట్టు సమాచారం. హెలికాప్టర్లో మొత్తం ఏడుగురు ఉన్నారని… సాంకేతికలోపం కారణంగానే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సోషల్ మీడియా వేదికగా ఘటనపై స్పందించారు. ‘రుద్రప్రయాగ్ జిల్లాలో హెలికాప్టర్ కూలిపోవటం విచారకరమన్నారు. SDRF, స్థానిక పరిపాలన, ఇతర రక్షణ బృందాలు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయి. ప్రయాణికులందరు సురక్షితంగా ఉండాలని ఆ కేదార్నాథుడ్ని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు.

Tags:    

Similar News