జగన్నాథ రథయాత్రకు జోరుగా సన్నాహాలు

Preparations for Jagannath Rath Yatra 2025 starting from June 27;

Update: 2025-06-15 08:23 GMT

జగన్నాధరథ యాత్ర 2025 కోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. జూన్ 27 నుండి ప్రారంభమయ్యే ఉత్సవం కోసం జగన్నాథ, బలభద్ర, సుభద్రల రథాలను ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. లక్షలాది మంది భక్తులు ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. 'బహుద జాత్ర' (తిరిగి రథోత్సవం) జూలై 5న జరుగుతుంది.

పండుగ సమయంలో, భక్తులు ముగ్గురు దేవతలను - జగన్నాథుడు, అతని సోదరుడు బలభద్రుడు మరియు సోదరి సుభద్రలను మూడు భారీ చెక్క రథాలలో గుండిచా ఆలయానికి తీసుకువెళతారు, అక్కడ వారు ఒక వారం పాటు నివసిస్తారు మరియు తరువాత జగన్నాథ ఆలయానికి తిరిగి వెళతారు. రథాల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. భక్తుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పూరీలో రథయాత్ర కోసం 365 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించారు. జూన్ 27 నుంచి జూలై 5 వరకు ఈ యాత్ర జరుగుతుంది. 

ముఖ్యమైన రోజులు:

జూన్ 26: ఆషాఢ శుక్ల విదియ తిథి.

జూన్ 27: రథయాత్ర ప్రారంభం.

జులై 1: హేరా పంచమి.

జులై 4: బహుదా యాత్ర (తిరిగి ఊరేగింపు).

జులై 5: సునా బేషా (దేవతల బంగారు వస్త్రధారణ)

Tags:    

Similar News