Jammu & Kashmir Records: జమ్మూ కశ్మీర్: 30 ఏళ్లలో తొలిసారి ‘టెర్రర్ ఫ్రీ మంత్’గా మే 2026
తొలిసారి ‘టెర్రర్ ఫ్రీ మంత్’గా మే 2026
Jammu & Kashmir Records: జమ్మూ కశ్మీర్లో గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా మే 2026 నెల పూర్తి ఉగ్రవాద రహితంగా (టెర్రర్ ఫ్రీ మంత్గా) ముగిసింది. ఈ నెలలో ఒక్క ఉగ్రవాద సంబంధిత హత్య గానీ, దాడి గానీ సంభవించలేదు.
అధికారిక గణాంకాల ప్రకారం, 2026 ఏడాది మొదటి ఐదు నెలల్లో మొత్తం కేవలం 12 ఉగ్రవాద సంబంధిత మరణాలు మాత్రమే నమోదయ్యాయి. వీటిలో సామాన్య పౌరులు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. ఈ మే నెలలో పూర్తి శాంతి నెలకొనడం గత మూడు దశాబ్దాల్లో ఇదే తొలిసారి.
గత చరిత్ర:
2001లో మే నెలలో ఒక్కటి 300 మరణాలు నమోదు కాగా, 2000లో 288 మరణాలు జరిగాయి. ఆ తర్వాత సంవత్సరాల్లో మరణాల సంఖ్య క్రమంగా తగ్గినప్పటికీ, హింసాత్మక ఘటనలు కొనసాగాయి. 2024 మేలో 7 మరణాలు, 2025 మేలో 43 మరణాలు సంభవించాయి.
ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లోనే మరణాలు గణనీయంగా తగ్గడం గమనార్హం. భద్రతా దళాలు నిరంతరం కొనసాగుతున్న ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, మెరుగైన నిఘా వ్యవస్థ, సమన్వయం కారణంగానే ఈ సానుకూల మార్పు సాధ్యమైందని అధికారులు తెలిపారు.
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే నెట్వర్క్ బలహీనపడుతోంది. ఉగ్ర గ్రూపులు తమ సామర్థ్యాలను పునర్నిర్మాణం చేసుకోకుండా భద్రతా దళాలు కఠినంగా అడ్డుకుంటున్నాయి. ఉగ్రవాద ముప్పును పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్రం, యూటీ పాలన, భద్రతా దళాలు కలిసి పని చేస్తున్నాయి.
ఈ సాఫల్యం జమ్మూ కశ్మీర్లో శాంతి, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నట్లు సూచిస్తోంది.