భద్రతాదళాల రాడార్ లోకి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా
హిడ్మా వెంట 300 మంది మావోయిస్టులు;
మెస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మాడ్వీ హిడ్మా కేంద్ర భద్రతా బలగాల రాడార్ పరిధిలోకి వచ్చినట్లు అంత్యంత విశ్వసనీయ సమాచారం వస్తోంది. హిడ్మాతో పాటు దాదాపు 300 మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. కేంద్ర కమిటీ సభ్యుడిగా, చత్తీస్ఘడ్ స్టేట్ మావోయిస్టు మిలటరీ ఇన్ఛార్జ్గా, పీఎల్జీఎ బెటాలియన్1 కమాండర్గా హిడ్మా మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హిడ్మా వెంట పీఎల్జీఎ బెటాలియన్-2 కమాండర్ దేవా, కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాత, పుల్లూరి ప్రసాదరావుల వంటి కీలక మావోయిస్టు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. నేషనల్ ఏరియా పార్కట్ టూ, అబూజ్మడ్ కారిడార్ లో హిడ్మా ఉన్నట్లు కేంద్ర భద్రతా దళాలకు పక్క సమాచారం అందినట్లు తెలిసింది. దీంతో ఉన్నతాధికారుల అనుమతితో భద్రతా దళాలు వెంటనే ఆపరేషన్ హిడ్మాను లాంచ్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. భద్రతా దళాలు బృందాలుగా విడిపోయి అబూజ్మడ్ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఇన్విటేషన్ అంబూష్ పేరితో వందలాది జవాన్ల ఊచకోతకు హిడ్మానే బాధ్యుడని కేంద్ర భద్రతా బలాగాలు అతనిపై ఆగ్రహంతో ఉన్నాయి. ఇప్పటికే హిడ్మాపై చత్తీస్ఘడ్, తెలంగాణ రాష్ట్రాలతో సహా అనేక రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి. మావోయిస్టుల వందలాది విధ్వంసకర చర్యలకు, ఆయుధాల సరఫాలో హిడ్మా కీలక సూత్రధారి. హిడ్మాపై కోటిన్నర రూపాయలకు పైగా రివార్డులు ఉన్నాయి. ఎన్ఐఏ, ఎస్ఐబీ, ఐబీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్ధలు సైతం హిడ్మా గురించి గాలిస్తున్నాయి. హైరెజల్యూషన్ ఉన్న డ్రోన్ కెమెరాలతో భూ ఉపరితలానికి 1500 అడుగుల ఎత్తు నుంచి ఎప్పటికప్పుడు హిడ్మా కదలికలను భద్రతా దళాలు పసిగడుతున్నాయి. గతంలో ఆపరేషన్ కర్రిగుట్లలో హిడ్మా దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడు. ఆపరేషన్ కగార్ పేరుతో గడచిని ఏడాదిన్నరగా దాదాపు 550 మందికి పైగా మావోయిస్టులను మట్టుబెట్టడమే కాకుండా వేలాది మంది మావోయిస్టులను సరెండర్ చేయించి దండకారణ్యంలో భద్రతా దళాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈదశలో హిడ్మాను కూడా పట్టుకుని మావోయిస్టులను తుదముట్టించాలని భద్రతాదళాలు ప్రతీకారవాంఛతో రగిలిపోతున్నాయి.